నిఖిల్ సినిమాలో హీరోయిన్ గా లావణ్య త్రిపాఠి

Update: 2018-05-18 09:45 GMT

'కిర్రాక్ పార్టీ' వంటి సక్సెస్ ఫుల్ చిత్రం తర్వాత నిఖిల్ హీరోగా టీ.ఎన్.సంతోష్ దర్శకత్వంలో వస్తున్న చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. నిఖిల్ సరసన హీరోయిన్ గా లావణ్య త్రిపాఠి నటిస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ చిత్రం షూటింగ్ ముప్పై శాతం పూర్తి చేసుకుంది. ‘విక్రమ్ వేద’ ఫేమ్ శ్యాం సి.ఎస్. సంగీతం సమకూరుస్తుండగా సూర్య ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు. ఆరా సినిమాస్ ప్రైవేట్ లిమిటెడ్, మూవీ డైనమిక్స్ ఎల్.ఎల్.పి బ్యానర్ ల పై కావ్య వేణుగోపాల్, రాజ్ కుమార్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ‘ఠాగూర్’ మధు సమర్పిస్తున్నారు.

Similar News