అక్కడ అయినా సక్సెస్ వస్తుందా..?

తెలుగులో నాగ చైతన్య ‘సవ్యసాచి’, అఖిల్ తో ‘మిస్టర్ మజ్ను’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులని పలకరించినా హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ కు ఇద్దరు అక్కినేని బ్రదర్స్ [more]

Update: 2019-05-23 09:33 GMT

తెలుగులో నాగ చైతన్య ‘సవ్యసాచి’, అఖిల్ తో ‘మిస్టర్ మజ్ను’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులని పలకరించినా హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ కు ఇద్దరు అక్కినేని బ్రదర్స్ హిట్ ఇవ్వలేకపోయారు. ఈ రెండు సినిమాలతో కుర్రాళ్ల మనసులను దోచుకున్న ఈ బ్యూటీకి తెలుగులో పెద్ద అవకాశాలు రాలేదు. అయితే పూరి జగన్నాధ్ మాత్రం తన సినిమాలో ఛాన్స్ ఇచ్చాడు. ప్రస్తుతం ఆమె రామ్ హీరోగా ‘ఇస్మార్ట్ శంకర్’ లో నటిస్తుంది. చిత్రీకరణ పరంగా ముగింపు దశకి చేరుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

తమిళ సినిమాలో

ఈ మూవీ చేస్తుండగానే తమిళంలో ఆమె ఒక ఛాన్స్ దక్కించుకుంది. జయం రవి హీరోగా ‘బోగన్’ ఫేమ్ లక్ష్మణ్ ఒక సినిమాను రూపొందిస్తున్నాడు. అందులో హీరోయిన్ గా నిధికి ఛాన్స్ వరించింది. తనకు సినిమా ఛాన్సులు రావట్లేదని హాట్ హాట్ పోజులు ఇస్తూ తన సోషల్ మీడియా ఫ్యాన్స్ తో రెగ్యులర్ గా టచ్ లో ఉంటుంది. పాపం ఈమెకు తెలుగులో ‘ఇస్మార్ట్ శంకర్’ తో అయినా సక్సెస్ అందుకుంటాదేమో చూద్దాం.

Tags:    

Similar News