ఎన్.జి.కె ధర బాగానే పలికిందే..!

తమిళ స్టార్ హీరో సూర్య లేటెస్ట్ మూవీ ఎన్.జి.కె. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని విలక్షణ దర్శకుడు సెల్వ రాఘవన్ డైరక్షన్ లో ప్రభు నిర్మించిన [more]

Update: 2019-05-18 08:30 GMT

తమిళ స్టార్ హీరో సూర్య లేటెస్ట్ మూవీ ఎన్.జి.కె. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని విలక్షణ దర్శకుడు సెల్వ రాఘవన్ డైరక్షన్ లో ప్రభు నిర్మించిన సినిమా ఈ నెల 31న తమిళంతో పాటు తెలుగులో కూడా రిలీజ్ చేయనున్నారు. రీసెంట్ గా తెలుగు రైట్స్ ను మంచి రేట్ కి దక్కించుకున్నారు సత్యసాయి సంస్థ అధినేత కే కే రాధామోహన్. తెలుగు థియేట్రికల్ హక్కులను ఎనిమిది కోట్లకు తీసుకున్నారు రాధామోహన్. ఈ సినిమాలో నటించిన వాళ్లంతా దాదాపు తెలుగు జనాలకు పరిచయం అయిన స్టార్స్.

క్రేజ్ ఉండటంతో

సాయి పల్లవి, జగపతిబాబు, రకుల్ ప్రీత్ సింగ్ ఉన్నారు. సూర్యకి ఇక్కడ ఎంతోకొంత మార్కెట్ ఉంది కాబట్టి ఆ క్రేజ్ తోనే ఈ మూవీ ఎనిమిది కోట్లకు హక్కులు కొన్నట్టు చెబుతున్నారు నిర్మాత రాధామోహన్. అయితే కేవలం థియేటర్ హక్కులు మాత్రమే రాధామోహన్ వి. పబ్లిసిటీ, డిజిటల్ ఖర్చులు అన్నీ తమిళ నిర్మాత ప్రభువే. థియేట్రికల్ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో ఈ మూవీపై బజ్ ఉంది. ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉన్నప్పుడు డైరెక్టర్ సెల్వ రాఘవన్ హర్ట్ అయ్యి సినిమా నుండి తప్పుకున్నాడని టాక్ ఉంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియదు.

Tags:    

Similar News