నీవెవరో ఫస్ట్ లుక్ విడుదల చేసిన కొర‌టాల

Update: 2018-07-04 13:43 GMT

ఆది పినిశెట్టి, తాప్సీ, రితికా సింగ్‌ హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రానికి 'నీవెవరో' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. కోన ఫిలిమ్‌ కార్పొరేషన్‌, ఎం.వి.వి సినిమా పతాకాలపై హరినాథ్‌ దర్శకత్వంలో కోన వెంకట్‌, ఎం.వి.వి.సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫ‌స్ట్‌ లుక్‌, మోష‌న్ పోస్ట‌ర్‌ని డైరెక్ట‌ర్ కొర‌టాల శివ విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయన మాట్లాడుతూ... ''ముందు నుండి వైవిధ్య‌మైన చిత్రాల‌ను చేస్తూ కొత్త టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేస్తూ నిర్మాణ సంస్థ‌ల్లో కోన ఫిలిమ్ కార్పొరేష‌న్‌, ఎం.వి.వి సినిమా బ్యాన‌ర్‌లు ముందుంటున్నాయి. ఈ సంస్థ‌లు మ‌ళ్లీ చేసిన నీవెవ‌రో అనే స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాయి. ఆది పినిశెట్టి, తాప్సీ, రితికా సింగ్‌లు ఈ సినిమాలో న‌టించ‌డం సినిమా పెద్ద ఎసెట్. సినిమా త‌ప్ప‌కుండా ఎంగేజింగ్ థ్రిల్ల‌ర్ అవుతుంది'' అన్నారు.

నటీనటులు...

ఆది పినిశెట్టి, తాప్సీ, రితికా సింగ్ హీరో హీరోయిన్లుగా న‌టించిన ఈ చిత్రానికి కెమెరా: సాయిశ్రీరామ్‌, ఆర్ట్‌: చిన్నా, ఎడిటింగ్‌: ప్ర‌వీణ్ పూడి.

Similar News