నయన్ అవమానించడం సహించలేకపోయా..!!

Update: 2018-09-16 07:23 GMT

చిన్న సినిమాలు కాదు కాదు.... బూతు సినిమాలతో తన కెరీర్ ని ప్రారంభించిన మారుతీ ఆ తర్వాత ఆ ముద్రను చెరిపేస్తూ డీసెంట్ సినిమాలు తీయడం స్టార్ట్ చేశాడు. ‘కొత్త జంట’ - ‘భలే భలే మగాడివోయ్’ - ‘బాబు బంగారం’ - ‘మహానుబావుడు’ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ సినిమాలు తీసిన తర్వాత నాగచైతన్యతో కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తెరక్కించిన చిత్రం ‘శైలజారెడ్డి అల్లుడు’. ఈచిత్రం ఈవారం వినాయక చవితి రోజు విడుదల అయింది. అయితే మొదటి రోజు నుండే మిశ్రమ స్పందనతో ఆడుతున్న ఈచిత్రం కలెక్షన్స్ మాత్రం చైతు కెరీర్ లోనే ఎన్నడూ లేని విధంగా వస్తున్నాయి. ఇక ఇలా ఉంటే ‘శైలజారెడ్డి అల్లుడు’ ప్రమోషన్ లో భాగంగా దర్శకుడు మారుతి ఓ టీవీ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఆ సందర్భంగా ఆయన 'బాబు బంగారం' టైములో నయనతారకి తనకు మధ్య గొడవ గురించి చెప్పడమే కాకుండా కొన్ని ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చాడు.

ఆమెతో గొడవపడ్డాను.....

వెంకటేష్ హీరోగా రూపొందిన చిత్రం ‘బాబు బంగారం’ లో నయనతార హీరోయిన్ అని తెలిసిన విషయమే. ఆ చిత్రం షూటింగ్ జరుగుతున్నప్పుడు నేను నయనతారతో చాలా ఇబ్బందులు పడ్డాను. ఆమె వెంకటేష్ గారితో గౌరవంగా లేకపోవడం చూసి.."మేము చిన్నవాళ్లం మాకు గౌరవం ఇవ్వకపోయినా పర్లేదు కానీ వెంకటేష్ గారి లాంటి సీనియర్ హీరో ముందు అలా ఉండొద్దని" చాలాసార్లు చెప్పను. కానీ ఆమె ఏమాత్రం వెంకటేష్ గారిపై రెస్పెక్ట్ లేకుండా మాట్లాడటం..ఆయన ముందు గౌరవం లేకుండా వ్యవహరించడంతో నేను ఆమెతో గొడవ పడాల్సి వచ్చింది అని చెప్పారు మారుతీ.

అరటి పండ్లను కూడా అమ్మా......

నాకున్న ఆర్థిక ఇబ్బందులు వల్ల..బతకడం కోసం తాను బండిపై అరటి పండ్లను కూడా అమ్మినట్లుగా చెప్పుకొచ్చాడు. 'ఆర్య' చిత్రాన్ని వంశి మరియు బన్నీతో కలిసి పంపిణీ చేయడంతో తన జీవితం మారిపోయిందని... అప్పుడునుండి ఇప్పుడు ఈ స్టేజి లో ఉన్నానని చెప్పారు. భారీ సినిమాలు పంపిణీ మరియు భారీ చిత్రాలను తెరకెక్కించే ఉద్దేశ్యం తనకు అస్సలు లేదు అంటూ చెప్పుకొచ్చాడు. నేను చిన్న సినిమాలే తీస్తానని..పెద్ద సినిమాల జోలికి అసలు వెళ్ళను. చిన్న సినిమాలతోనే మంచి కాన్సెప్ట్ తో ప్రేక్షకులను అలరిస్తాను అంతే కానీ పెద్ద సినిమాలు చేయడం తన వల్ల కాదని చెప్పుకొచ్చారు.

Similar News