ఇద్దరు యంగ్ హీరోలకు ఛాన్స్ ఇచ్చిన త్రివిక్రమ్

నా పేరు సూర్య సినిమా తరువాత చాలా గ్యాప్ తీసుకున్న బన్నీ త్రివిక్రమ్ తో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. అరవింద సమేత సినిమా తరువాత త్రివిక్రమ్ [more]

Update: 2019-04-14 10:37 GMT

నా పేరు సూర్య సినిమా తరువాత చాలా గ్యాప్ తీసుకున్న బన్నీ త్రివిక్రమ్ తో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. అరవింద సమేత సినిమా తరువాత త్రివిక్రమ్ చేస్తున్న సినిమా ఇదే. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ చేసుకుని నిన్ననే పూజా కార్యక్రమాలు జరుపుకుంది.
భారీ బడ్జెట్ తో రూపొందుతోన్న ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ‘టబు’ ఒక కీలకమైన పాత్రలో కనిపించనుంది. అలానే అక్కినేని నాగార్జున మేనల్లుడు సుశాంత్ కూడా ఇందులో ఓ ముఖ్య పాత్ర లో కనిపించనున్నాడు. అలానే నవదీప్ కూడా ఓ ఇంట్రెస్టింగ్ రోల్ లో కనిపించనున్నాడని టాక్.

ఇద్దరి హీరోలకి ప్రస్తుతం కెరీర్ పరంగా చెప్పుకోవడానికి ప్రస్తుతం సరైన సినిమాలు లేవు. సక్సెస్ కోసం ఎదురు చేస్తున్న వీరికి త్రివిక్రమ్ ఛాన్స్ ఇచ్చాడు. అమాయక చక్రవర్తి పాత్రలో సుశాంత్ కనిపించనున్నాడట. నవదీప్ పాత్ర ఎలా ఉంటాదో తెలియాల్సిఉంది. సునీల్ .. రాజేంద్రప్రసాద్…రావు రమేశ్ లు కూడా ఇందులో కనిపించనున్నారు. ఈనెల 24 నుండి ఈసినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈసినిమా తరువాత బన్నీ సుకుమార్ తో ఓ సినిమా చేయనున్నాడు.

Tags:    

Similar News