"మౌనం మాటతోటి"కి మంచి స్పందన

Update: 2018-08-10 12:25 GMT

సమ్మోహనంతో తెలుగు ప్రేక్ష‌కుల్ని స‌మ్మోహ‌నం చేసిన సుధీర్ బాబు హీరోగా, సుధీర్ బాబు ప్రొడక్షన్స్ బ్యాన‌ర్ లో ఆర్‌.ఎస్.నాయుడు దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం నన్ను దోచుకుందువటే. ఈ చిత్రంలోని "మౌనం మాటతోటి"... అనే పాట లిరికల్ వీడియోను విడుదల చేశారు. విడుదల చేసిన కొద్దిసేపటికే సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచింది. అజనీష్ లోకనాథ్ సంగీతం అందించడంతో పాటు గాయకుడి గానూ మెప్పించాడు. ప్రముఖ రచయిత శ్రీ మణి సాహిత్యమందించారు. విజయ్ మాస్టర్ ఈ పాటకు కొరియోగ్రఫి చేశారు. ఇప్పటికే ఫస్ట్ లుక్ టీజర్ తో సినిమాపై అంచనాలు క్రియేట్ చేసింది. ఈ చిత్ర షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్య‌క్ర‌మాలు శరవేగంగా జరుగుతున్నాయి. అన్నికార్య‌క్ర‌మాలు పూర్తిచేసి వినాయ‌కచ‌వితి ప‌ర్వ‌దినాన సెప్టెంబ‌ర్ 13న విడుద‌ల చేయాటానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

Similar News