కోపమొస్తే ఏం చేస్తుంది

సై రా సినిమా విడుదలై అప్పుడే రెండు వారాలు పూర్తి చేసుకుంది. తాజాగా సై రా సినిమా మెయిన్ హీరోయిన్ నయనతార సినిమా యూనిట్ మీద ఆగ్రహంతో [more]

Update: 2019-10-19 09:03 GMT

సై రా సినిమా విడుదలై అప్పుడే రెండు వారాలు పూర్తి చేసుకుంది. తాజాగా సై రా సినిమా మెయిన్ హీరోయిన్ నయనతార సినిమా యూనిట్ మీద ఆగ్రహంతో ఉన్నట్లుగా టాలీవుడ్, కోలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. ఎందుకంటే మెయిన్ హీరోయిన్ గా తాను నటిస్తే సినిమాలో మాత్రం సెకండ్ హీరోయిన్ తమన్నాకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడంతో నయన్ గుస్సా అయినట్లుగా టాక్. సినిమా విడుదల ప్రమోషన్స్ కి రాని నయనతార ఇప్పుడు ఇలా తమన్నా కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని కోపం తెచ్చుకోవడం ఎంతవరకు న్యాయమంటున్నారు మెగా ఫాన్స్.

ప్రమోషన్స్ కు రాకుండా…..

చిరంజీవి సై రా సినిమా ప్రమోషన్స్ కి రాకుండా హ్యాండ్ ఇచ్చి ఇపుడు తన పాత్రకి ప్రాధాన్యత లేదనడం విడ్డురంగా ఉందంటున్నారు. అయితే నయనతార సినిమాలో మెయిన్ లీడ్ కాబట్టి ఆమె పాత్రకే ప్రాధాన్యత ఉంటుంది అనుకుంటే.. సినిమా విడుదలయ్యాక తమన్నా కేరెక్టర్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. మరి తమన్నాని కేవలం గెస్ట్ రోల్ అనుకుంటే.. చివరికి సినిమాకే కీలకం చేసి.. నయనతార ని గెస్ట్ గా నిలబెట్టసారు. అందుకే నయనతార తన బాధని తన సన్నిహితుల దగ్గర వెళ్లగక్కుతుందట.

Tags:    

Similar News