రాజమౌళి అక్కడికి తీసుకెళ్తే… నాగ్ అశ్విన్ మరో మెట్టు ఎక్కిస్తాడట!!

రాజమౌళి బాహుబలి సినిమాతో ప్రభాస్ ని పాన్ ఇండియా స్టార్ ని చేసాడు. పాన్ ఇండియా లెవల్లో బాహుబలి ప్రభాస్ గా ప్రభాస్ క్రేజ్ దేశ ఎల్లలు [more]

Update: 2020-06-16 06:47 GMT

రాజమౌళి బాహుబలి సినిమాతో ప్రభాస్ ని పాన్ ఇండియా స్టార్ ని చేసాడు. పాన్ ఇండియా లెవల్లో బాహుబలి ప్రభాస్ గా ప్రభాస్ క్రేజ్ దేశ ఎల్లలు దాటింది. దానితో రాజమౌళి బాహుబలి సినిమాని దేశ విదేశాల్లో డబ్ చేసి విడుదల చేసాడు. చైనా, జర్మని అంటూ బాహుబలిని విడుదల చేసాడు. దాని కోసం రాజమౌళి జర్మనీ, చైనా కూడా బాహుబలి టీం తో వెళ్లి ప్రచారం చేసాడు. అయితే ఇప్పుడు ప్రభాస్ తో రాధాకృష్ణ మూవీ తర్వాత మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ తో పాన్ ఇండియా మూవీకి శ్రీకారం చుట్టాడు. మహానటితో అదరగొట్టిన నాగ్ అశ్విన్ ప్రభాస్ సినిమా కోసం రెండేళ్ళనుండి స్క్రిప్ట్ ని చెక్కుతున్నాడట. ఈ మూవీ మూడవ ప్రపంచ యుద్ధం నేపథ్యంలో ఉండబోతోందట. థర్డ్ వరల్డ్ వార్ కీ పాయింట్ గా తెరకెక్కబోయే ఈసినిమాకి భారీ సెట్స్ అవసరమట.

అయితే ఈ సినిమాని నాగ్ అశ్విన్ దేశం లోని పలు భాషలు మాత్రమే కాదు.. వరల్డ్ వైడ్ గా వివిధ భాషల్లో తెరకేకించే ప్లాన్ లో ఉన్నాడట. దేశ విదేశాల్లో ప్రభాస్ కున్న క్రేజ్, ఇమేజ్ దృష్ట్యా ఈ చిత్రాన్ని హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కించాలని ప్లాన్ లో ఉన్నాడట. ఈ సినిమా ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవల్ కి మారడంతో.. ఈ సినిమా కోసం వివిధ భాషల నటులను ఎంపిక చేయబోతున్నాడట. అలాగే  వివిధ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ కి సంబంధించి హాలీవుడ్ టెక్నిషియన్స్  ఈ సినిమా కోసం పని చేసేందుకు నాగ్ అశ్విన్ సిద్ధం చేస్తున్నాడట. ఇక ఈ సినిమా మొదలయ్యే లోపు కరోనా ప్రభావం కూడా తగ్గి హాలీవుడ్ నుండి పనిచేసేందుకు వచ్చే వాళ్ళకి ఇబ్బందులు ఉండవని అంటున్నారు.

Tags:    

Similar News