ఫ్యాన్స్ కు స్వీట్ షాక్ ఇచ్చిన నాగ్

అక్కినేని నాగార్జున నుండి సోలో సినిమా వచ్చి చాలాకాలం అవుతుంది. ప్రస్తుతం నాగ్ రాహుల్ రవీంద్ర డైరెక్షన్ లో ‘మన్మధుడు-2’ మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఆల్రెడీ ఫస్ట్ [more]

Update: 2019-05-13 08:36 GMT

అక్కినేని నాగార్జున నుండి సోలో సినిమా వచ్చి చాలాకాలం అవుతుంది. ప్రస్తుతం నాగ్ రాహుల్ రవీంద్ర డైరెక్షన్ లో ‘మన్మధుడు-2’ మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఆల్రెడీ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా దసరాకో లేదా క్రిస్మస్‌కో రిలీజ్ చేస్తారులే అనుకున్నారు ఫ్యాన్స్ అంతా. అయితే తాజా సమాచారం ప్రకారం మరో రెండు నెలల్లో ఈ సినిమాను రిలీజ్ చేయాలని నాగ్ భావిస్తున్నట్టు టాక్. నిజానికి నాగ్ ‘మన్మధుడు-2ను ఆగస్టులో రిలీజ్ చేయాలని ప్లాన్ వేసాడు. కానీ అదే నెలలో ప్రభాస్ ‘సాహో’ ఉండడంతో ఎందుకు వచ్చిందిలే తలనొప్పి అని ఆగస్టులో ‘మన్మథుడు-2’ను వదలడం మంచిది కాదన్న అభిప్రాయానికి వచ్చారట.

రెండు నెల‌ల్లోషూటింగ్ అవుతుందా..?

పోనీ దసరాకు రిలీజ్ చేద్దాం అంటే ‘సైరా’ తో పాటు అల్లు అర్జున్ – త్రివిక్రమ్ సినిమా ఉండనుంది. అందుకే పోటీ తక్కువ ఉన్న జులై నెలలోనే ‘మన్మథుడు-2’ను ప్రేక్షకుల ముందుకు తేవాలని నాగ్ భావిస్తున్నాడట. అంటే రెండు నెలల్లో ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిపోతుందా? ఏమో నాగ్ ఆలోచన చూస్తుంటే అంతే అనిపిస్తుంది. మరి ఇంత త్వరగా కంప్లీట్ చేస్తే క్వాలిటీ విషయంలో ఏమన్నా తేడా కొడితే? ఇటువంటి ప్రశ్నలు ఫ్యాన్స్ ని కంగారు పెడుతున్నాయి. ఇక ఈ సినిమాకు రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్ చేస్తున్నాడు. తన మొదటి ‘చి ల సౌ’ను నెల రోజుల్లోనే అవగొట్టేయడం విశేషం. నాగ్ కి జోడిగా రకుల్ నటిస్తుంది.

Tags:    

Similar News