ఆ ప్రాజెక్ట్ ఆగిపోలేదంటున్న నాగ్..!

గత ఏడాది ఆఫీసర్ సినిమా డిజాస్టర్ తర్వాత నాగార్జున తెలుగు సినిమాలు వదిలేసి బాలీవుడ్ లో బ్రహ్మాస్త్ర మీద పడ్డాడు. అయితే చాలాకాలం టాలీవుడ్ సినిమాలకు దూరంగా [more]

Update: 2019-04-04 06:13 GMT

గత ఏడాది ఆఫీసర్ సినిమా డిజాస్టర్ తర్వాత నాగార్జున తెలుగు సినిమాలు వదిలేసి బాలీవుడ్ లో బ్రహ్మాస్త్ర మీద పడ్డాడు. అయితే చాలాకాలం టాలీవుడ్ సినిమాలకు దూరంగా ఉన్న నాగార్జున సోగ్గాడే చిన్ని నాయన సీక్వెల్ ని బంగార్రాజుగా చేయ్యబోతున్నాడనే న్యూస్ నడిచింది. అయితే కళ్యాణ్ కృష్ణ నేల టిక్కెట్ అట్టర్ ఫ్లాప్ అవడంతో.. ఇక నాగార్జున డ్రీం ప్రాజెక్ట్ బంగార్రాజు ఆగిపోయిదని.. కళ్యాణ్ కృష్ణ పై నాగ్ కి నమ్మకం లేదు కాబట్టి నాగ్ తన కలల ప్రాజెక్ట్ ని వదిలేసాడనే అన్నారు. అందులోనూ రీసెంట్ గా నాగార్జున మన్మధుడు కి సీక్వెల్ గా మన్మధుడు 2ని మొదలు పెట్టేశాక నిజంగానే బంగార్రాజు అటకెక్కేసిందనే అన్నారు.

ఏకకాలంలో రెండు సీక్వెల్స్

కానీ తాజాగా నాగార్జున బంగార్రాజు స్క్రిప్ట్ మీద కళ్యాణ్ కృష్ణ కూర్చున్నాడు. నాగార్జున చెప్పిన విధంగా బంగార్రాజు స్క్రిప్ట్ ని చెక్కుతున్నాడనే టాక్ మొదలైంది. టాక్ మాత్రమే కాదు నాగార్జున రీసెంట్ గా ఒక ఆంగ్ల దినపత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఎన్నికల హడావిడి ముగిసిన తరువాత బంగార్రాజు సినిమాను పట్టాలెక్కించనున్నట్టు చెప్పాడు. మరి సోగ్గాడే చిన్నినాయనలో తనకెంతో ఇష్టమైన బంగార్రాజు పాత్రనే సినిమాగా చెయ్యాలని నాగ్ అనుకున్నాడు. అది ఇన్నాళ్లకి పట్టాలెక్కబోతుంది. మరి నాగార్జున అటు మన్మధుడు సీక్వెల్ ఇటు సోగ్గాడే సీక్వెల్ ఏకకాలంలోనే చేస్తాడంటున్నారు.

Tags:    

Similar News