నాగ్ జ్యోకం చేసుకోలేదట

Update: 2018-11-02 03:06 GMT

తన సినిమాలు స్టోరీ నుండి రిలీజ్ వరకు చూసుకునే నాగార్జున తన కొడుకుల సినిమాల విషయంలో కొంచం ఎక్కువ శ్రద్దే చూపిస్తుంటారు. అఖిల్ కెరీర్ స్టార్టింగ్ నుండి ఇప్పటికి తన సినిమాల విషయంలో హ్యాండు త‌ప్ప‌నిస‌రి. అలానే రీసెంట్ గా వచ్చిన నాగ చైతన్య మూవీ 'శైల‌జా రెడ్డి అల్లుడు'కీ నాగ్ హ్యాండు ప‌డింది. కానీ అది అనుకున్న స్థాయిలో ఆడలేదు. ఇలా తన కొడుకుల సినిమాల విషయంలో ఎడిటింగ్ రూమ్ లో కూర్చుని మరి రిపేర్ చేస్తుంటాడు నాగ్. అవి కొన్నిసార్లు వర్క్ అవుట్ అవుతుంది కొన్నిసార్లు బెడ‌సి కొట్టాయి.

అయితే 'స‌వ్య‌సాచి' విషయంలో నాగ్ జోక్యం చేసుకోలేదట. పూర్తి బాధ్యతలు ద‌ర్శ‌క నిర్మాత‌ల‌పైనే పెట్టేసాడట. ఇది కొంచం ఆశ్చర్యం కలిగించే విషయమే. 'శైల‌జా రెడ్డి అల్లుడు' ఫ్లాప్ అయ్యింది. ఈ పరిస్థితిల్లో 'స‌వ్య‌సాచి' కోసం మ‌రిన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటాడ‌నుకున్నారు. కానీ నాగ్ ఆ సినిమాపై దృష్టి పెట్ట‌లేదు. కాకపోతే ఎప్పుడో ఒక్కసారి ఎడిటింగ్ వెర్షన్ చూసి కొన్ని సలహాలు ఇచ్చాడట అంతే ఆ తరువాత దాన్ని పటించుకోలేదు అని తెలుస్తుంది.

ఇదంతా నాగ్‌కి మైత్రీ మూవీస్‌పై, ద‌ర్శ‌కుడిపై ఉన్న న‌మ్మ‌క‌మా? లేదంటే ఇలాంటి క్లిష్ట‌మైన క‌థ‌ల్లో జోక్యం చేసుకోక‌పోవ‌డ‌మే ఉత్త‌మం అనుకున్నాడా? అనేది స‌క్తిని రేకెత్తిస్తోంది. ఇన్సైడ్ టాక్ ప్రకారం ఈసినిమా బాగా వచ్చిందని సమాచారం. మరి ఏం అవుతుందో మరో కొన్ని గంటల్లో తేలిపోనుంది.

Similar News