చైతూ కోసం రంగంలోకి అత్తగారు దిగింది!

Update: 2018-06-08 09:30 GMT

నాగ చైతన్య - చందు మొండేటి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సవ్యసాచి సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ లో చిత్ర బృందం బిజీగా వుంది. ఇక నాగ చైతన్య సవ్యసాచి సినిమాతో పాటు మారుతీ దర్శకత్వంలో శైలజ రెడ్డి అల్లుడు సినిమాలోనూ నటిస్తున్నాడు. శైలజ రెడ్డి అల్లుడు సినిమా రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడో మొదలైంది. ఈ సినిమా లో నాగ చైతన్య కి జోడిగా అను ఇమ్మాన్యుయేల్ నటిస్తుంది. అయితే శైలజ రెడ్డి అల్లుడు అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగ చైతన్యకి పవర్ ఫుల్ అత్తగా రమ్యకృష్ణ కనబడనుంది.

రంగంలోకి దిగిన రమ్యకృష్ణ...

మారుతీ.. అప్పుడే ఈ చిత్రాన్ని దాదాపుగా 50 శాతం షూటింగ్ కంప్లీట్ చేసేసాడు. మిగతా 50 శాతం షూటింగ్ కూడా పక్కాగా ప్లాన్ చేసింది చిత్ర బృందం. అయితే ఈ నెల 18వ తేదీ నుంచి శైలజ రెడ్డి అల్లుడు సినిమా షూటింగ్ హైదరాబాద్ .. రామోజీ ఫిల్మ్ సిటీలో తదుపరి షెడ్యూల్ మొదలు పెడతారు. రామోజీ ఫిలిం సిటీలోనే ఈ సినిమా షూటింగ్ 15 రోజుల పాటు కొనసాగుతుందట. మరి పవర్ ఫుల్ అత్తకి.. కొంటె అల్లుడుగా ఈ సినిమాలో రమ్యకృష్ణ .. చైతూ మధ్య ఆసక్తికరమైన సన్నివేశాలు ఉంటాయంటున్నారు చిత్ర బృందం. మాస్ ఆడియన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకునేలా చైతూ - రమ్యకృష్ణ మధ్య సన్నివేశాలు ఉంటాయని... ఆ సన్నివేశాలని ఈ హైదరాబాద్ షెడ్యూల్ లో చిత్రీకరిస్తారని తెలుస్తుంది. మరి సినిమాకి అతి కీలకమైన ఈ షెడ్యూల్ కోసం రమ్యకృష్ణ అప్పుడే రంగంలోకి దిగిపోయినదట. గోపీసుందర్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.

Similar News