చైతు – అజయ్ సినిమా అందుకే ఆగిపోయిందా..?

నాగ చైతన్య – ఆర్ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి కాంబినేషన్ లో ‘మహాసముద్రం’ అనే సినిమా తెరకెక్కబోతుందని గత కొన్ని నెలలు నుండి వార్తలు వస్తున్నాయి. [more]

Update: 2019-05-13 08:41 GMT

నాగ చైతన్య – ఆర్ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి కాంబినేషన్ లో ‘మహాసముద్రం’ అనే సినిమా తెరకెక్కబోతుందని గత కొన్ని నెలలు నుండి వార్తలు వస్తున్నాయి. దానికి సంబంధించి డైరెక్టర్ – హీరో మధ్య చర్చలు కూడా జరిగాయి. ఒక కీలక పాత్ర కోసం సమంతని కూడా సంప్రదించారు. కట్ చేస్తే ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఇప్పుడే అదే సినిమాను రవితేజ చేస్తున్నాడు అని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా ఫిలింనగర్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం రవితేజతో తీయబోయేది మహాసముద్రం ప్రాజెక్టు కాదట. రవితేజ మార్కెట్ కి మహాసముద్రం సినిమా భారీ బడ్జెట్ గా మారుతుందట. అందుకే మరో కథతో రవితేజని డైరెక్ట్ చేయాలని చూస్తున్నాడు అజయ్. త్వరలోనే దీనిపై అధికార ప్రకటన రానుంది.

తొంద‌ర పెడుతున్న ర‌వితేజ‌

అంత బాగానే ఉంది కానీ అసలు చైతుతో మహాసముద్రం ప్రాజెక్టు ఎందుకు ఆగిపోయిందనే వివరాలు మాత్రం బయటకు రాలేదు. అయితే లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం మజిలీ లాంటి ఫీల్ గుడ్ మూవీ తరువాత చైతు ఫ్యామిలీ ఎంటర్టైనర్ వెంకిమమా చేస్తున్నాడు. అజయ్ చెప్పిన కథ ఏమో యాక్షన్ అడ్వెంచర్. ఈ రెండు సినిమాల తరువాత మాస్ సబ్జెక్ట్ ను సెలక్ట్ చేసుకోవడానికి ధైర్యం సరిపోలేదంటున్నారు. అందుకే సినిమా ఆగిపోయిందని టాక్. మరోవైపు రవితేజ అజయ్ ని తెగ తొందర పెడుతున్నాడట. తనతో సినిమా చేయమని రవితేజ.. భూపతిపై ఒత్తిడి తీసుకొచ్చినట్టు తెలుస్తోంది.

Tags:    

Similar News