కరోనా తో కర్ఫ్యూ…. ఇంట్లో మాత్రం

ప్రస్తుతం భారత్ మొత్తం కరోనా జనతా కర్ఫ్యూతో ఎక్కడిక్కడ నిలిచిపోయి.. అంత బంద్ వాతావరణం కనబడుతుంది. ఇండియా మొత్తం 14 గంటలు జనతా కర్ఫ్యూ ఉంటె తెలంగాణాలో [more]

Update: 2020-03-22 07:14 GMT

ప్రస్తుతం భారత్ మొత్తం కరోనా జనతా కర్ఫ్యూతో ఎక్కడిక్కడ నిలిచిపోయి.. అంత బంద్ వాతావరణం కనబడుతుంది. ఇండియా మొత్తం 14 గంటలు జనతా కర్ఫ్యూ ఉంటె తెలంగాణాలో కేసీఆర్ మాత్రం 24 గంటల జనతా కర్ఫ్యూ చేయాలంటూ పిలునిచ్చారు. అత్యవరస ప్రయాణాలు తప్ప ఎవరూ రోడ్డు మీదకి రావొద్దు అంటూ అందరూ జనతా కర్ఫ్యూ లో పాల్గొంటున్నారు. అయితే సినిమా ప్రముఖులు అంత ఇంట్లో కూర్చుని జనతా కర్ఫ్యూ పై అందరిలో చైతన్యం నింపడమే కాదు… ఈ కర్ఫ్యూ అనేది మన కోసమే.. అందరూ ఇంట్లో నే ఉండండి అంటూ అభిమానులకు పిలుపునిస్తున్నారు.

ఇక టాలీవుడ్ యంగ్ హీరో ఒకరు ఈ జనతా కర్ఫ్యూ సందర్భంగా ఇంట్లోనే కూర్చుని తల్లితో కలిసి కొత్త ఆవకాయ కలుపుతున్నాడు. అశ్వద్ధామ చిత్రంతో ప్రేక్షకులను పలకరించిన నాగ శౌర్య ప్రస్తుతం పలు సినిమాల్తో బిజీగా వున్నాడు. ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా సినిమా షూటింగ్స్ బంద్ అవడం నేడు ఆదివారం జనతా కర్ఫ్యూ కారణంగా ఇళ్లకే పరిమితమైన నాగ శౌర్య తల్లి ఉష తో కలిసి కొత్త ఆవకాయ కలుపుతున్నాడు. ప్రస్తుతం మామిడికాయ పచ్చళ్ళ సీజన్ స్టార్ట్ కావడంతో.. శౌర్య తన జనతా కర్ఫ్యూని ఇలా వినియోగించుకుంటున్నారు. తల్లి పచ్చడి కి కావాల్సిన సరుకులు వేస్తుంటే నాగ శౌర్య ఆవకాయ ని చేతితో కలుపుతూ ఆ ముచ్చటైన దృశ్యాన్ని వీడియో రూపంలో సోషల్ మీడియాలో షేర్ చేసాడు. కొత్త ఆవకాయ.. హోమ్ మెడ్ అంటూ వీడియో షేర్ చేసాడు

Tags:    

Similar News