శౌర్య వచ్చి మొత్తం మార్చేశాడు..!

ఆ మధ్య సందీప్ కిషన్ – సంతోష్ జాగర్లమూడి కాంబినేషన్ లో సినిమా ప్రకటించారు. ఇంతవరకు దానికి సంబంధించి ఎటువంటి బజ్ లేదు. అయితే తాజా సమాచారం [more]

Update: 2019-02-19 09:54 GMT

ఆ మధ్య సందీప్ కిషన్ – సంతోష్ జాగర్లమూడి కాంబినేషన్ లో సినిమా ప్రకటించారు. ఇంతవరకు దానికి సంబంధించి ఎటువంటి బజ్ లేదు. అయితే తాజా సమాచారం ప్రకారం ఆ సినిమా చేతులు మారినట్టు తెలుస్తుంది. కేవలం నిర్మాతలే కాదు హీరో కూడా మారినట్టు టాక్. సందీప్ కిషన్ ప్లేస్ లో నాగశౌర్య వచ్చాడు. ఈ మూవీని ఏషియన్ సునీల్ నిర్మిస్తున్నారు. ఆయన నిర్మాణ రంగంలోకి దిగిన తరువాత ఇది రెండో ప్రాజెక్టు. ప్రస్తుతం ఒకటి శేఖర్ కమ్ముల తో చేస్తున్నాడు.

విలువిద్య నేపథ్యంలో…

అయితే సందీప్ – సంతోష్ చేద్దాం అనుకున్న కథే సునీల్ దగ్గరకు వెళ్లిందా? లేదా కంప్లీట్ గా కథను మార్చేసి నాగ శౌర్యతో చేస్తున్నారా? అన్నది తెలియాల్సి ఉంది. నిజానికి సందీప్ కిషన్ తో చేద్దాం అనుకున్న సినిమా విలువిధ్య నేఫథ్యంలో ఉంటుంది. దానికి ధనుర్ధారి అని టైటిల్ కూడా అనుకున్నారు. కానీ ఇప్పుడు హీరో కూడా మారిపోయాడు. శౌర్య ఇప్పుడు మంచి ఫిజిక్ తో ఉన్నాడు. ధనుర్ధారి అనే టైటిల్ కు శౌర్య సూట్ అవతాడని అనుకుని, ప్రాజెక్టు మొత్తం ఇలా మార్చేసినట్లు కూడా వినిపిస్తోంది. అయితే ఈ మూవీ ఎప్పుడూ స్టార్ట్ అవుతుందో తెలియాలి.

Tags:    

Similar News