నచ్చకపోతే చూడొద్దు.. నచ్చితే పది మందికి చెప్పండి

Update: 2018-08-25 10:31 GMT

ఛ‌లో లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రం త‌రువాత నాగ‌శౌర్య‌.. ఐరా క్రియోష‌న్స్ కాంబినేష‌న్ లో ప్రొడ‌క్ష‌న్ నెం-2 గా తెర‌కెక్కుతున్న చిత్రం న‌ర్త‌న‌శాల. శంకర ప్రసాద్ సమర్పణలో ఉషా ముల్పూరి నిర్మాత. శ్రీనివాస్ చక్రవర్తి దర్శకుడు. క‌ష్మిర ప‌ర‌దేశి, యామిని భాస్క‌ర్ హీరోయిన్స్ గా న‌టిస్తున్నారు. మ‌హ‌తి స్వ‌ర సాగ‌ర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. ఈ నెల 30న నర్తనశాల చిత్రం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఫంక్షన్ సినీ ప్రముఖులు, అభిమానుల సమక్షంలో గ్రాండ్ గా జరిగింది. ఈ సందర్భంగా హీరో నాగశౌర్య మాట్లాడుతూ... ‘ఈ సినిమా మీకు తప్పకుండా నచ్చుతుంది. మాకు నచ్చింది. నచ్చకపోతే ఎవ్వరూ చూడొద్దు. నచ్చితే మాత్రం ఇంకో పదిమందికి చెప్పండి. ఫ్యాన్స్ కి ఎంత ఇచ్చినా తక్కువే.’ అని తేల్చేశాడు. ప్రముఖ దర్శకుడు వంశీ పైడిపల్లి, దర్శకురాలు నందినీ రెడ్డి, నటులు శివాజీ రాజా, చిత్ర దర్శకుడు డైరెక్టర్ శ్రీనివాస చక్రవర్తి, హీరోయిన్ కశ్మీరా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Similar News