నాగశౌర్య వదిలిన సినిమా ఇంకో హీరోకు..!

నాగశౌర్య హీరోగా దర్శకుడు సతీష్ వేగేశ్న డైరెక్షన్ లో ఆల్ ఈజ్ వెల్ అనే టైటిల్ తో ఓ సినిమా ఉండాలి కానీ అది ఇప్పుడు కళ్యాణ్ [more]

Update: 2019-05-28 06:27 GMT

నాగశౌర్య హీరోగా దర్శకుడు సతీష్ వేగేశ్న డైరెక్షన్ లో ఆల్ ఈజ్ వెల్ అనే టైటిల్ తో ఓ సినిమా ఉండాలి కానీ అది ఇప్పుడు కళ్యాణ్ రామ్ చేతికి వెళ్లింది. రీసెంట్ గా కల్యాణ్ రామ్, సతీష్ వేగేశ్న మధ్య చర్చలు పూర్తయ్యాయి. త్వరలోనే ఈ మూవీ లాంఛనంగా ప్రారంభం అవుతుంది. ఆదిత్య మ్యూజిక్ బ్యానర్ పై ఉమేష్ గుప్తా నిర్మాతగా ఈ మూవీ తెరకెక్కనుంది. ఛలో తరువాత ఒక్క హిట్ కూడా లేని నాగ శౌర్య ఈ మధ్యకాలంలో చాలా సినిమాలను పక్కనపెట్టాడు. కారణం ఏంటో తెలియదు కానీ ఓకే చేసిన సినిమాలన్నీ వదిలేసుకుంటున్నాడు.

వరుసగా సినిమాలు వదులుకుంటున్న నాగశౌర్య

సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై కూడా ఓ సినిమాను క్యాన్సల్ చేసుకున్నాడు. రీసెంట్ గా సతీష్ వేగేశ్న సినిమాను కూడా వదులుకున్నాడు. అటు కళ్యాణ్ రామ్ కూడా విరించి వర్మ దర్శకత్వంలో చేయాల్సిన ప్రాజెక్టును వదిలేసాడు. ఈ క్రమంలో కళ్యాణ్ రామ్ ని సతీష్ కలవడం… ఇద్దరి మధ్య చర్చలు జరగడం… ప్రాజెక్ట్ ఓకే అవ్వడం అంతా చకచకా జరిగిపోయాయి. ఇది పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని టాక్ వస్తుంది. 118 తరువాత కళ్యాణ్ రామ్ నుండి వస్తున్న చిత్రం ఇదే. అయితే ఈ మూవీకి సంబంధించి హీరోయిన్ తో పాటు మిగతా వివరాలు వచ్చే నెలలో తెలుస్తాయి.

Tags:    

Similar News