చైతు అర్జునుడైతే... కృష్ణుడెవరో?

Update: 2018-11-01 01:36 GMT

చందు మొండేది దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో నాగ చైతన్య హీరోగా తెరకెక్కిన 'సవ్యసాచి' చిత్రం రేపు శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మంచి' అంచనాల నడుమ భారీగా ప్రేక్షకులముందుకు రాబోతున్న ఈ సినిమాలోతమిళ హీరో మాధవన్ విలన్ గా కీలకపాత్రలో నటించాడు. నాగ చైతన్య కి జోడిగా బాలీవుడ్ భామ నిధి అగర్వాల్ నటించింది. అయితే ఈ సినిమాలో నాగ చైతన్య అర్జునుడిగా కనిపించబోతున్నాడు. 'సవ్యసాచి' అంటే అర్జునుడనే అర్ధం. అంటే అర్జునుడు రెండు చేతులతో బాణాలు సందించగలడు కాబట్టే 'సవ్యసాచి' అనేపేరొచ్చింది.

'సవ్యసాచి' ట్రైలర్ లో చూసినదాన్ని బట్టి నాగ చైతన్య కూడా తనకి తెలియకుండానే ఎడమ చేత్తో కూడా పోరాడుతుంటాడు. కానీ నాగ చైతన్య ఈ సినిమా లో నిజంగానే అర్జునుడు గెటప్ వేసాడట. పౌరాణికంగా చైతు... అర్జునుడు గెటప్ ఉండబోతుంది. మరి చైతు అర్జునుడైతే.. కృష్ణుడు గెటప్ లో ఎవరు కనబడతారో అనేగా మీ డౌట్. ప్రస్తుతం కమెడియన్ గా మంచి ఫామ్ లో ఉన్న వెన్నెల కిషోర్ కృష్ణుడిగా 'సవ్యసాచి'లో కనిపించబోతున్నాడట. ఈ సినిమా లో అర్జునుడు (చైతు) – కృష్ణుడు(వెన్నెల కిషోర్) మ‌ధ్య సాగే ఓ ఎపిసోడ్ ఉందట. ఆ ఎపిసోడ్ ని ద‌ర్శ‌కుడు చందూ మొండేటి హిలేరియ‌స్‌గా తీర్చిదిద్దాడ‌ని సన్నహిత వర్గాల భోగట్టా.

మరి చైతు యాక్షన్ అండ్ మాస్ గెటప్ లోనే కాదు.. ఇలా అర్జునిడిగా కామెడీ కూడా చేస్తాడన్నమాట. ఇక చందు మొండేటి ఈ సినిమాలో యాక్షన్ కి యాక్షన్ కామెడీ కి కామెడీ ఏది తక్కువ కాకుండా జాగ్రత్త పడ్డాడట. ఇక వెన్నెల కిషోర్ - నాగ చైతన్య మధ్య వచ్చే ఫన్నీ సన్నివేశాలతో ప్రేక్షకులు బాగా నవ్వుకుంటారట. చూద్దాం రేపు ఈ పాటికల్లా 'సవ్యసాచి' లో విషయం ఎంతుందో అనేది తెలిసిపోతుంది.

Similar News