నాగ్ సాహసం చేస్తున్నాడా..?

Update: 2018-08-14 06:52 GMT

టాలీవుడ్ లో సీక్వెల్స్ ఏ మాత్రమూ కలిసి రావని తెలిసినా మన వాళ్లు ఆగటం లేదు. ఈ నేపథ్యంలో తెరపైకి ఓ ఇంట్రెస్టింగ్ సినిమా వచ్చింది. నాగ్ తన కెరీర్ లో చెప్పుకోదగ్గ హిట్స్ లో 'మన్మధుడు' కూడా ఒకటి. ప్రస్తుతం ఈ సినిమా సీక్వెల్ తీసే ఆలోచనలో నాగ్ ఉన్నట్టు తెలుస్తుంది. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున 'మన్మధుడు 2 ' టైటిల్ ని రిజిస్టర్ చేయించాడట. గతంలో 'మన్మధుడు' సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాటలు రాయగా..విజయ్ భాస్కర్ దర్శకత్వం చేశారు.

మరి దర్శకుడు ఎవరు..?

అప్పట్లో ఈ సినిమా ఎవర్ గ్రీన్ ఎంటర్ టైనర్ గా నిలిచిపోయింది. అందుకే దీని సీక్వెల్స్ తీస్తే బాగుంటుందని నాగ్ ఆలోచన అంట. అయితే పార్ట్ 1 ను డైరెక్ట్ చేసిన విజయ్ భాస్కర్ ప్రస్తుతం ఇండస్ట్రీ లో లేడు. త్రివిక్రమ్ కూడా అతనికి ఉన్న కమిట్మెంట్స్ తో అంత ఈజీగా దొరకడు. మరి నాగ్ ఎవరితో తీద్దామని ప్లాన్ చేసాడో అంతు చిక్కడం లేదు. అసలు ఈ టైటిల్ అతని కోసమేనా లేక తన కొడుకుల కోసమా అన్న విషయం తెలియాల్సి ఉంది.

సీక్వెల్స్ కలిసిరావుగా...

కానీ టాలీవుడ్ కు సీక్వెల్స్ అసలు కలిసి రావని చాలా సార్లు రుజువైంది. గాయం 2, శంకర్ దాదా జిందాబాద్, మనీ మనీ, సర్దార్ గబ్బర్ సింగ్, కిక్ 2, రాజుగారి గది 2 .. ఇలా చాలానే సినిమాలు ఉన్నాయి. ఒక్క 'బాహుబలి' తప్ప అన్ని సినిమాలు డిజాస్టర్స్ అయ్యాయి. ఇటువంటి సెంటిమెంట్ ఉన్నప్పుడు నాగ్ దీనిని ఎందుకు టచ్ చేస్తున్నాడో అర్ధం కావట్లేదు. ఈ సినిమా స్క్రిప్ట్ మీద కాన్ఫిడెన్స్ తో ఈ సెంటిమెంట్స్ అన్ని పక్కన పెట్టి టైటిల్ రిజిస్టర్ చేశారా? అన్న కామెంట్స్ వస్తున్నాయి. ఏది ఏమైనా నాగ్ సాహసం చేస్తున్నాడనే చెప్పాలి. చూద్దాం ఇది ఎంతవరకు వర్క్ అవుట్ అవుతుందో..

Similar News