తెలంగాణ సీ ఎం రిలీఫ్ ఫండ్‌కి 50 లక్షల విరాళాన్ని ప్రకటించిన‌ కింగ్ నాగార్జున

వరద బాధితుల సహాయార్ధం తెలంగాణ సీ ఎం రిలీఫ్ ఫండ్‌కి 50 లక్షల విరాళాన్ని ప్రకటించిన‌ కింగ్ అక్కినేని నాగార్జున  కొన్ని రోజులుగా తెలంగాణలో కురుస్తున్న భారీ [more]

Update: 2020-10-21 05:32 GMT

వరద బాధితుల సహాయార్ధం తెలంగాణ సీ ఎం రిలీఫ్ ఫండ్‌కి 50 లక్షల విరాళాన్ని ప్రకటించిన‌ కింగ్ అక్కినేని నాగార్జున 

కొన్ని రోజులుగా తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా  ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాలు నీట మునిగి జనజీవనం స్తభించిపోయింది. బాధితులను ఆదుకోవడానికి కింగ్ అక్కినేని నాగార్జున వెంటనే స్పందించారు. రూ.50 లక్షల విరాళాన్ని ప్రకటించి తన పెద్ద మనసుని చాటుకున్నారు. 
” భారీ వర్షాల కారణంగా హైదరాబాద్‌లో సామాన్యులు ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. వారి కోసం  తెలంగాణ ప్రభుత్వం వెంటనే రూ.550 కోట్ల విడుదల చేయడం మంచి పరిణామం. నా వంతుగా రూ.50 లక్షలను సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు అందిస్తున్నాను” అన్నారు.

Tags:    

Similar News