ఆ సినిమాను రిలీజ్ చేస్తున్నందుకు గర్వంగా ఉంది

Update: 2018-08-01 14:28 GMT

కొత్తదనాన్ని.. కొత్త డైరెక్టర్స్‌ ని ప్రోత్సహించడంలో కింగ్‌ నాగార్జున ఎప్పుడూ ముందుంటారు అనేది 'చి.ల.సౌ' చిత్రంతో మరోసారి ప్రూవ్‌ అయ్యింది. యంగ్‌ హీరో సుశాంత్‌ హీరోగా, రుహాని శర్మ హీరోయిన్‌గా సిరుని సినీ కార్పోరేషన్‌ పతాకంపై నాగార్జున అక్కినేని, జస్వంత్‌ నడిపల్లి... రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం 'చి.ల.సౌ'. ఈ చిత్రాన్ని చూసిన కింగ్‌ నాగార్జున ఎంతో నచ్చి ఇంప్రెస్‌ అయ్యి అన్నపూర్ణ స్టూడియోస్‌, మనం ఎంటర్‌ ప్రైజెస్‌ ద్వారా ఆగస్ట్‌ 3న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌ అవుతోంది. ఈ సందర్భంగా అన్నపూర్ణ సెవెన్‌ ఎకర్స్‌ లో ప్రెస్‌మీట్‌ని ఏర్పాటు చేశారు.

జెన్యూన్‌గా సినిమా చాలా బాగుంది!

కింగ్‌ నాగార్జున మాట్లాడుతూ...''ఈ సినిమా నాగచైతన్య చూసి ''చి.ల.సౌ' సినిమా చాలా బాగుంది. ఒకసారి చూడండి'' అన్నాడు. ఈ సినిమా గురించి నాకు ఏమీ తెలియకుండానే అయిష్టంగా చూశాను. సినిమా చాలా ప్లెజెంట్‌గా వుంది. చాలా సర్‌ప్రైజ్‌ అయ్యాను. నెగిటివ్‌ మైండ్‌తో వున్నా నేను 10 నిమిషాల తర్వాత అదిపోయి ఓపెన్‌ మైండ్‌తో కామన్‌ ఆడియన్‌లా చూశాను. చాలా అరెస్టింగ్‌గా వుంది. నాకు బాగా నచ్చింది. రైటింగ్‌, స్క్రీన్‌ప్లే ఫెంటాస్టిక్‌గా వుంది. ప్రతి ఒక్క ఆర్టిస్ట్‌ ఎంతో బాగా చేశారు. రీ-రికార్డింగ్‌ ఎక్కడ ఎంత కావాలో అంతే చేశారు. రాహుల్‌ సూపర్బ్‌ గా తీశాడు. ఇలాంటి సినిమాలు నేను ఎందుకు తియ్యట్లేదు అన్పించింది. ఈ సినిమాని అన్నపూర్ణ నుండి బ్యాక్‌ చేద్దాం అనగానే రాహుల్‌ ఇమ్మీడియెట్‌గా ఓకే అన్నాడు. అలా ఈ సినిమాతో నిర్మాతగా ఎంటర్‌ అయ్యాను. నాకు ఇదొక కొత్త జర్నీ. ఇలాంటి ఒక మంచి సినిమాలో నన్ను పార్టనర్‌గా జాయిన్‌ చేసుకున్నందుకు నిర్మాతలకు నా థాంక్స్‌. ఆకలితో వున్నవారికి అన్నం చాలా రుచిగా వున్నట్లు ఈ సినిమాని అలాగే చేశారు. కొత్తదనం వున్న సినిమాలు ప్రజెంట్‌ బాగా ఆడుతున్నాయి. ప్రేక్షకులు ఏది పడితే అది చూడట్లేదు'' అని పేర్కొన్నారు.

Similar News