బాలీవుడ్ చిత్రంలో నాగార్జున

Update: 2018-07-10 11:25 GMT

తెలుగు సినిమాలో తనకంటూ ప్రత్యేక చరిష్మా సంపాదించుకున్న నటుడు అక్కినేని నాగార్జున. తెలుగులో ఎంతో ప్రత్యేక స్థానం ఉన్న ఆయన ఇప్పుడు బాలీవుడ్ వైపు అడుగులు వేస్తున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో వస్తున్న బ్రహ్మాస్త్ర సినిమాలో ఆయన నటించనున్నారు. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, రణబీర్ కపూర్, ఆలియా భట్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. 15 ఏళ్ల తర్వాత ఈ సినిమాతో మళ్లీ బాలీవుడ్ లో నాగ్ కనిపించనున్నారు.

నేటి నుంచే షూటింగ్...

25 ఏళ్ల క్రితం రాంగోపాల్ వర్మ శివ చిత్రంతో మొదట బాలీవుడ్ లోకి ప్రవేశించిన నాగ్ 2003లో చివరిసారగా ఎల్ఓసీ కార్గిల్ చిత్రంలో నటించారు. అప్పటి నుంచి ఆయన అటువైపు చూడకున్నా, ఇటీవల బాలీవుడ్ చిత్రాలపై మనస్సు పడ్డారంట. పలు చిత్రాల్లో అవకాశం వచ్చినా, చివరగా బ్రహ్మాస్త్ర చిత్రంలో నటించేందుకు అంగీకరించారు. ఆయన మంగళవారం నుంచే ముంబైలో చిత్ర షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఇటీవల విడుదలైన నాగ్ ఆఫీసర్ సినిమా ఫ్లాప్ కావడంతో ఆయన చాలా జాగ్రత్తగా సినిమాలను ఎంపిక చేసుకుంటున్నట్లు కనపడుతోంది.

Similar News