ప్రభాస్ టైం ఇచ్చాడు.. కాబట్టి మరో సినిమా చేస్తాడా?

ప్రభాస్ రాధేశ్యాం షూటింగ్ అవకుండానే నాగ్ అశ్విన్ భారీ పాన్ ఇండియా మూవీ ని ప్రకటించాడు. నాగ్ అశ్విన్ ప్రభాస్ సినిమా స్క్రిప్ట్ మీద కూర్చీవడమే కాదు… [more]

Update: 2020-09-22 04:11 GMT

ప్రభాస్ రాధేశ్యాం షూటింగ్ అవకుండానే నాగ్ అశ్విన్ భారీ పాన్ ఇండియా మూవీ ని ప్రకటించాడు. నాగ్ అశ్విన్ ప్రభాస్ సినిమా స్క్రిప్ట్ మీద కూర్చీవడమే కాదు… ప్రభాస్ కోసం బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనేని కూడా ఎంపిక చేసి అధికారిక ప్రకటన చేసాడు. అయితే ప్రభాస్ – నాగ్ అశ్విన్ ముచ్చట్లు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో హల్చల్ చేసేటప్పుడే ప్రభాస్ మరో పాన్ ఇండియా మూవీ.. డైరెక్ట్ హిందీ మూవీ ఆదిపురుష్ ప్రకటించి షాకిచ్చాడు. అయితే రాధేశ్యాం – నాగ్ అశ్విన్ మూవీ తర్వాతే ఆదిపురుష్ ఉంటుంది అనుకుంటే… ఓం రనౌత్ ముందుగా ఆదిపురుష్ నే ఫినిష్ చేసేలా వ్యవహరిస్తున్నాడు. నాగ శ్విన్ మూవీ పక్కన బెట్టి ముందు ఆదిపురుష్ కె ప్రభాస్ మొగ్గు చూపుతున్నాడు కూడా.

అయితే నాగ్ అశ్విన్ ప్రభాస్ స్క్రిప్ట్ పూర్తి చేసుకున్నాడట. ఇక ఎలాగూ ప్రభాస్ ఆదిపురుష్ గనక మొదలు పెట్టి తన సినిమాకి గ్యాప్ ఇస్తే.. ఈలోపు నాగ శ్విన్ మరో చిన్న మూవీ ఏమైనా చేస్తాడా? అనే డౌట్ అందరిలో కలుగుతుంటే నాగ్ అశ్విన్ మాత్రం ఓ వెబ్ సీరీస్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడట. అది బాలీవుడ్ లో హిట్ అయిన లస్ట్ స్టోరీస్ వెబ్ సీరీస్ తెలుగులో రీమేక్ చేస్తున్నారు. బాలీవుడ్ లో నాలుగు ఎపిసోడ్స్ ని నలుగురు డైరెక్టర్స్ తెరకెక్కించినట్టుగా.. తెలుగులోనూ నాలుగు ఎపిసోడ్స్ కి నలుగురు దర్శకులు పనిచెయ్యబోతుంటే.. ఒక ఎపిసోడ్ కి నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేయబోతున్నాడట. ఈ వెబ్ సీరీస్ ఈ ఏడాది చివరికి పూర్తవుతుంది అని… దీనికోసం టాలీవుడ్ స్టార్స్ నటిస్తున్నారని వినికిడి.

Tags:    

Similar News