నాగ్ అశ్విన్ స్పీడ్ మీదున్నాడు!

లాక్ డౌన్ వల్ల కొంతమందికి ఇబ్బంది కలగొచ్చుగాని మన టాలీవుడ్ డైరెక్టర్స్ కి కథలు రెడీ చేసుకునే తీరిక దొరికింది. దాంతో మన డైరెక్టర్స్ అంతా తమ [more]

Update: 2020-05-03 03:48 GMT

లాక్ డౌన్ వల్ల కొంతమందికి ఇబ్బంది కలగొచ్చుగాని మన టాలీవుడ్ డైరెక్టర్స్ కి కథలు రెడీ చేసుకునే తీరిక దొరికింది. దాంతో మన డైరెక్టర్స్ అంతా తమ వద్ద ఉన్న కథలను పూర్తి చేసే పనిలో పడ్డారు. ఇక లాక్ డౌన్ కి ముందు ప్రభాస్ తో నాగ్ అశ్విన్ సినిమా ఓకే అయిన సంగతి తెలిసిందే. ఇది పాన్ ఇండియా మూవీ కావడంతో కథను రెడీ చేయడానికి చాలా టైం పడుతుందేమో అనుకున్నాం కానీ అశ్విన్ మాత్రం ప్రభాస్ తో చేస్తున్న సినిమా స్క్రిప్ట్ కంప్లీట్ చేసినట్టు తెలుస్తుంది.

లాక్ డౌన్ పూర్తయిన వెంటనే షూటింగ్ కు సంబంధించి పనులు కూడా స్టార్ట్ కానున్నట్టు తెలుస్తుంది.ప్రస్తుతం ప్రభాస్ రాధా కృష్ణ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు. ఈమూవీ కంప్లీట్ అయిన వెంటనే ప్రభాస్ తో నాగ్ అశ్విన్ సినిమాను స్టార్ట్ చేస్తాడు. ఇక ఈమూవీని వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ నిర్మించనున్నారు. ఇది సోషియో ఫాంటసి చిత్రం కావడంతో గ్రాఫిక్స్ కోసం చాలానే ఖర్చు పెట్టనున్నారు.

Tags:    

Similar News