నాగ్ అశ్విన్ కూడా.. బాలీవుడ్ కే జై కొడుతున్నాడు!!

ప్రభాస్ ఆదిపురుష్ తో డైరెక్ట్ హిందీ సినిమాలో పాన్ ఇండియా లెవల్లో నటిస్తున్నాడని అంటున్నారు. ఎందుకంటే బాలీవుడ్ డైరెక్టర్ ఓం రనౌత్ ఆదిపురుష్ డైరెక్ట్ చెయ్యడం అలాగే.. [more]

Update: 2020-10-10 01:40 GMT

ప్రభాస్ ఆదిపురుష్ తో డైరెక్ట్ హిందీ సినిమాలో పాన్ ఇండియా లెవల్లో నటిస్తున్నాడని అంటున్నారు. ఎందుకంటే బాలీవుడ్ డైరెక్టర్ ఓం రనౌత్ ఆదిపురుష్ డైరెక్ట్ చెయ్యడం అలాగే.. టి సీరీస్ నిర్మాతలు సినిమాని నిర్మించడం.. ఆదిపురుష్ కథ పాన్ ఇండియా లెవల్ కి ఉండడం, అలాగే విలన్ గా సైఫ్ అలీ ఖాన్ ని తీస్కోవడమే కాదు.. హీరోయిన్ కూడా బాలీవుడ్ నుండే ఇది పక్కా. కాగా ఇప్పుడు ప్రభాస్ తెలుగు డైరెక్టర్ నాగ శ్విన్ తో చెయ్యబోయే సినిమా కూడా పక్కా బాలీవుడ్ నే టార్గెట్ చేస్తుంది అని నాగ్ అశ్విన్ చేతలను బట్టి తెలుస్తుంది. ఎందుకంటే నాగ్ అశ్విన్ నేషనల్ లెవల్ కాకుండా ప్రభాస్ తో చెయ్యబోయే చిత్రాన్ని ఇంటర్నేషనల్ లెవల్లో రాసుకున్నాడని టాక్ ఉంది. అందుకు అనుగుణంగా ప్రభాస్ పక్కన బాలీవుడ్ టాప్ సుందరి దీపికా పాడుకొనే ని ఎంపిక చేసి ఆమెని ఒప్పించిన నాగ్ అశ్విన్ అధికారిక ప్రకటన కూడా ఇచ్చేసాడు.

ఇక ప్రభాస్ పుట్టిన రోజుకి ముందే మరో కిల్లర్ అప్ డేట్ ఇస్తున్నా అని ఎనౌన్స్ చేసిన నాగ్ అశ్విన్ తాజాగా ప్రభాస్ – దీపికా కాంబోలో తెరకెక్కబోయే సినిమాలో బాలీవుడ్ మెగా స్టార్ అమితాబచ్చన్ నటిస్తున్నాడు అంటూ ప్రకటించేశాడు. మరి నాగ్ ఆశ్విన్ ప్రభాస్ తో చెయ్యబోయే సినిమాలో బాలీవుడ్ స్టార్స్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడో ఓ క్లారిటీ వచ్చేసింది. అంటే నాగ్ అశ్విన్ సౌత్ కన్నా ఎక్కువగా బాలీవుడ్ స్టార్స్ నే ప్రభాస్ సినిమాలో హైలెట్ చేస్తున్నాడు అంటే.. నాగ్ అశ్విన్ కూడా ఆదిపురుష్ దర్శకుడు ఓం రనౌత్ లాగా హిందీనే టార్గెట్ చేస్తున్నాడని ఫిక్స్ అవ్వొచ్చు. మరి సాహో, రాధేశ్యాం ని ఎక్కువగా సౌత్ కి నచ్చేలా చేసిన ప్రభాస్ ఇప్పుడు తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ని మాత్రం హిందీ ప్రేక్షకులు దగ్గరగా తియ్యబోతున్నాడని అర్ధమైపోయింది. మరి ఇప్పుడు ప్రభాస్ కి ఆదిపురుష్ ముందా? నాగ్ అశ్విన్ సినిమా ముందా?  అనేది అందరిలో ఉన్న సస్పెన్స్.

Tags:    

Similar News