హైప్ పెంచడానికి మరీ అంత అవసరమా?

Update: 2018-04-27 05:07 GMT

ప్రస్తుతం టాలీవుడ్ రెండు పెద్ద సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ తో కళకళలాడుతుంది. స్టార్ హీరోలైన రామ్ చరణ్ రంగస్థలంతో అదిరిపోయే హాట్ కొడితే... మహేష్ బాబు భరత్ అనే నేను తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసాడు. మరి ఈ లెక్కన మరో స్టార్ హీరో అల్లు అర్జున్ కూడా నా పేరు సూర్య తో హిట్ కొట్టాల్సిందే. అన్నట్టుగా తయారైంది పరిస్థితి. ఇద్దరు హీరోలు వరుసగా హిట్స్ కొడితే మూడో హీరో సినిమా కూడా ఖచ్చితంగా హిట్ కొడుతుందో లేదో అనే ఆసక్తితో ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తున్నారు. అయితే ఆ ఇద్దరు హీరోలు తమ సినిమాల మీద విడుదలకు ముందే చేసిన ప్రమోషన్ సినిమా విజయంలో కీలకంగా మారింది. అందుకే అల్లు అర్జున్ కూడా నా పేరు సూర్య సినిమా పాటలను, టీజర్ ని వదులుతూ సినిమా పై హైప్ క్రియేట్ చేస్తున్నాడు.

అయితే రంగస్థలం, భరత్ అనే నేను సినిమాకి వచ్చిన బజ్ నా పేరు సూర్యకి రావడం లేదు. అందుకే అల్లు అర్జున్ ఈ సినిమా మీద హైప్ తేవడానికి చాలా కష్టపడుతున్నాడు. నా పేరు సూర్య ఆడియో వేడుకని బయటెక్కడో నిర్వహించిన అల్లు అర్జున్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని మాత్రం రంగస్థలం చిట్టిబాబు రామ్ చరణ్, మెగా ఫాన్స్ సమక్షంలో గ్రాండ్ గా చేస్తున్నాడు. అయితే ఇంకా సినిమా మీద క్రేజ్ తీసుకురావడనికి అల్లు అర్జున్ నా పేరు సూర్య ప్రీ రిలీజ్ ఈవెంట్ స్టేజ్ మీదకి రావడానికి గాను దాదాపుగా 20 లక్షల వరకూ ఖర్చు పెడుతున్నారట. అయితే ఆ 20 లక్షల ఖర్చు దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కంటెంట్ కి తగినట్టుగా .. జిమ్నాస్టిక్స్ ను జోడిస్తూ చేసే ప్రయోగంతో ఆలు అర్జున్ స్టేజ్ పైకి వస్తాడట.

మరి జిమ్నాస్టిక్స్ చేస్తూ స్టేజ్ మీదకి రావడం అంటే... అక్కడ అలాంటి ఏర్పాట్లు చెయ్యాల్సి ఉంటుంది. అందుకే దాదాపుగా ఆ ఏర్పాట్లకు 20 లక్షల ఖర్చు పెడుతున్నారు. ఇక అల్లు అర్జున్ చెయ్యబోయే ఈ ఫీట్ ఈ సినిమాపై అంచనాలు పెంచడమే కాకుండా.. ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉంటుందని అంటున్నారు. మరి నా పేరు సూర్య విషయంలో అల్లు అర్జున్ మాత్రం చాలా స్టైలిష్ గా తెలివిగా ఆలోచిస్తున్నాడనేది మాత్రం పూర్తిగా అర్ధమవుతుంది.

Similar News