‘మైత్రీ మూవీ మేకర్స్’ బ్యానర్ లో మెగా టైటిల్

Update: 2018-08-26 11:27 GMT

టాలీవుడ్ ఫిలిం ఛాంబర్ లో కొన్ని ఆసక్తికర టైటిల్స్ రిజిస్టర్ చేయించారు నిర్మాతలు. టైటిల్ క్యాచీగా ఉంటె సినిమా జనాల్లోకి ఊరికే వెళ్తుందని అంత నమ్ముతారు. అందుకే రకరకాల టైటిల్స్ తో దర్శకనిర్మాతలు మన ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో రీసెంట్ గా ఫిలిం ఛాంబర్ లో 'మైత్రీ మూవీ మేకర్స్' ఓ ఆసక్తికర టైటిల్ ను రిజిస్టర్ చేశారు.

చిరంజీవి టైటిల్....

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ఒన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన'హీరో' టైటిల్ ను ఆ సంస్థ రిజిస్టర్ చేయించింది. అయితే ఈ టైటిల్ ను ఏ హీరోతో సినిమా చేయబోతున్నారని అన్న అంశం ప్రస్తుతం టాలీవుడ్ లో చర్చనీయాంశం అయింది. ప్రస్తుతం నిర్మిస్తున్న నాగ చైతన్య ‘సవ్యసాచి’ తో పాటు రవి తేజ ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ ‘డియర్ కామ్రేడ్ సినిమాలని నిర్మిస్తున్నారు ‘మైత్రీ మూవీ మేకర్స్’ సంస్థ.

ఏ హీరో మరి.....

ఈ రెండు సినిమాలే కాకుండా ఇంకో రెండుమూడు సినిమాలు నిర్మిస్తున్నారు మైత్రి వారు. అందులో సుకుమార్ - మహేష్ సినిమా ఒకటి. మహేష్ సినిమాకి అయితే ఇటువంటి టైటిల్ పెట్టరు. సాయి ధరమ్ తేజ్ సినిమాకి 'చిత్రలహరి’ అని టైటిల్ పెట్టేసారు. మరి 'హీరో' టైటిల్ ఏ హీరోతో తీస్తారో అన్న ఆసక్తి మొదలైంది.

Similar News