మైత్రి మూవీస్ తగ్గిందండోయ్..!

ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ వారికి భారీ సినిమాలు నిర్మించడమే టార్గెట్. క్వాలిటీ, క్వాంటిటీ విషయంలో ఎక్కడా కంప్రమైజ్ కారు. పెద్ద హీరోలు, పెద్ద డైరెక్టర్సే [more]

Update: 2019-05-04 12:43 GMT

ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ వారికి భారీ సినిమాలు నిర్మించడమే టార్గెట్. క్వాలిటీ, క్వాంటిటీ విషయంలో ఎక్కడా కంప్రమైజ్ కారు. పెద్ద హీరోలు, పెద్ద డైరెక్టర్సే వీరి టార్గెట్. మొదటి సినిమా నుండే పెద్ద కాస్టింగ్ తో సినిమాలు తీయడం స్టార్ట్ చేసిన వీళ్లు ప్రభాస్, పవన్, బన్నీ, త్రివిక్రమ్, బోయపాటి, సుకుమార్ ఇలా హేమాహేమీలకు అడ్వాన్స్ లు అందించి భారీ ప్రణాళికలు రెడీ చేసుకున్నారు. ఇది వీరికి ముందు నుండే ఉన్న అలవాటు. అయితే ఇప్పుడు ప్లాన్ లన్నీ తారుమారైపోయాయి. మెల్లిమెల్లిగా ఇచ్చిన అడ్వాన్సులు తిరిగి వచ్చేస్తున్నాయి. త్రివిక్రమ్ అడ్వాన్స్ తిరిగి ఇచ్చే ఆలోచనలో ఉన్నట్టు టాక్. అలానే బోయపాటికి ఇచ్చిన అడ్వాన్స్ కూడా వెనక్కి తీసుకోనుంది మైత్రి. సుకుమార్ ఎవరితో సినిమా చేస్తాడో క్లారిటీ లేదు.

మీడియం సినిమాలే మేలు

పవన్ ఎప్పుడు సినిమా చేస్తాడో క్లారిటీ లేదు. ప్రభాస్ ఇప్పట్లో మైత్రి వారితో సినిమా చేసే ఛాన్స్ లేదు. అందుకే ఎందుకులే అని మీడియం సినిమాలే బెటర్ అన్న ఐడియాకు వచ్చేసినట్లు తెలుస్తోంది. అందుకే నాని, విజయ్ లతో సినిమాలు చేద్దాం అని ఫిక్స్ అయింది. నాని – విక్రమ్ కుమార్ కాంబినేషన్ లో ఓ సినిమా వస్తుంది. అది ఈ బ్యానర్ లోనే రూపొందనుంది. అలానే విజయ్ దేవరకొండతో ‘డియర్ కామ్రేడ్’ చేసింది. అలానే విజయ్ తో మరో సినిమా చేయనుంది. రీసెంట్ గా వైష్ణవ్ తేజ్ ని పరిచయం చేస్తూ ఓ చిన్న సినిమా స్టార్ట్ చేసింది. అలా ఇంకా మంచి స్క్రిప్ట్ ఎవరు తెస్తే వారితో, ఎవరు దొరికితే ఆ హీరోలతో మీడియం సినిమాలు చేయాలనే ఆలోచనతో మైత్రి వారు ఉన్నట్టు టాక్.

Tags:    

Similar News