సాహోకి షాక్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్స్..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ సాహో. దాదాపు షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్న ఈ సినిమా రిలీజ్ డేట్ రీసెంట్ [more]

Update: 2019-05-28 06:27 GMT

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ సాహో. దాదాపు షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్న ఈ సినిమా రిలీజ్ డేట్ రీసెంట్ గా ప్రకటించారు. అంతా బాగానే ఉంది అనుకున్న టైంలో ఫ్యాన్స్ ని కంగారు పెట్టే ఓ వార్త బయటకి వచ్చింది. ఈ సినిమా నుండి తాజాగా సంగీత దర్శకులు వైదొలిగారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో కన్ఫర్మ్ చేస్తూ శంకర్ – ఎహసాన్ – లాయ్ ద్వయం ఒక ట్వీట్ ని కూడా వేశారు.

ట్విట్టర్ లో చెప్పిన మ్యూజిక్ డైరెక్టర్స్

“సాహో చిత్రానికి సంబంధించిన స్వర కల్పనా బాధ్యతల నుండి శంకర్ ఎహసాన్ లాయ్ ద్వయం విరమించుకుంటుంది అని మా అభిమానులందరికీ తెలియజేస్తున్నాము. ఈ సందర్భంగా నిర్మాతలు వంశీ ప్రమోద్, డైరెక్టర్ సుజీత్ కి ఇవే మా శుభాకంక్షాలు అందజేస్తున్నాము” అని తమ ట్విట్టర్ అకౌంట్ లో పేర్కొన్నారు. అయితే ఎందుకు వీరు ఈ మూవీ నుండి తప్పుకోవాల్సి వచ్చిందో మాత్రం చెప్పలేదు. వీరి ప్లేస్ లో జిబ్రాన్, తమన్ లను తీసుకున్నారు.

Tags:    

Similar News