రామ్ చరణ్ తో సినిమా ఫిక్స్ అయింది!

మహానటి లాంటి జెన్యూన్ హిట్ తో అందరి ద్రుష్టి తనవైపు తిప్పుకున్నాడు డైరెక్టర్ నాగ అశ్విన్. ప్రస్తుతం ఈయన ప్రభాస్ తో ఓ సోసియో ఫాంటసీ చిత్రం [more]

Update: 2020-05-10 04:15 GMT

మహానటి లాంటి జెన్యూన్ హిట్ తో అందరి ద్రుష్టి తనవైపు తిప్పుకున్నాడు డైరెక్టర్ నాగ అశ్విన్. ప్రస్తుతం ఈయన ప్రభాస్ తో ఓ సోసియో ఫాంటసీ చిత్రం చేస్తున్నాడు. దీనికి దాదాపు 200 కోట్ల భారీ బ‌డ్జెట్‌. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా రూపుదిద్దుకోనుంది. ఇక దీని తరువాత అశ్విన్ రామ్ చరణ్ తో ఓ సినిమా చేయనున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్ కూడా లాక్ అయినట్టు తెలుస్తుంది.

నిజానికి మహానటి తరువాత అశ్విన్ చిరంజీవితో ఓ సినిమా ప్లాన్ చేశాడు. పాతాళ భైర‌వికి రీమేక్‌లా ఆ సినిమా ఉండ‌బోతోంద‌ని అన్నాడు. కాకపోతే ఏం అయిందో ఏంటో అది ఆగిపోయింది. ఇక చరణ్ తో చేయడానికి ఫిక్స్ అయ్యాడు అశ్విన్. రీసెంట్ గా అశ్విన్ దత్ జ‌గ‌దేక‌వీరుడు అతిలోక సుంద‌రి సీక్వెల్ నాగ అశ్విన్ తో తెరకెక్కించ నున్నానని చెప్పేసాడు. అది చ‌ర‌ణ్‌తోనే అని అభిమానులూ ఫిక్స‌య్యారు. చూడాలి మరి అశ్విన్ ఎటువంటి సబ్జెట్ చరణ్ తో తీస్తాడో అని.

Tags:    

Similar News