27న మోహినిగా వస్తోన్న త్రిష

Update: 2018-07-21 09:15 GMT

తెలుగు ప్రేక్ష‌కుల్లో త‌న‌దైన అందం, అభినయంలో ద‌శాబ్ద‌కాలంగా టాప్ హీరోయిన్ గా ఆక‌ట్టుకున్న త్రిష తిరిగి మెహినిగా తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. త‌మిళం, తెలుగు భాష‌ల్లో మెహిని గా ఈ చిత్రం తెర‌కెక్కింది. ఈ చిత్రాన్ని వైజాగ్ డిస్ట్రిబ్యూట‌ర్ శ్రీ ల‌క్ష్మీ పిక్చ‌ర్స్ తెలుగులో విడుద‌ల చేస్తున్నారు. ప్రిన్స్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై నిర్మాణం చేప‌ట్టారు. ఆర్‌.మాదేష్ ద‌ర్శ‌కుడు. హారర్ కామెడి బ్యాక్‌డ్రాప్ లో ఈ చిత్రం తెర‌కెక్కింది. ఈ చిత్రంలో త్రిషతో పాటు జాఖీ, యోగి బాబు, పూర్ణిమా భాగ్యరాజ్ ముఖ్య‌పాత్ర‌ల్లో న‌టించారు. వివేక్-మెర్విన్ సంగీతం అందిస్తున్నారు. ఆర్‌.బి.గురుదేవ్ సినిమాటోగ్రఫి బాగుంది. థింక్ మ్యూజిక్ ద్వారా ఈ చిత్ర ఆడియోని విడుద‌ల చేశారు. ఇటీవ‌లే సెన్సారు కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం జులై 27న రెండు భాషల్లో విడుద‌ల చేస్తున్నారు.

అందరినీ ఆకట్టుకుంటుంది...

ఈ సంద‌ర్బంగా నిర్మాత‌లు మాట్లాడుతూ... ‘‘త్రిషకి తెలుగులో ఉన్న క్రేజ్ అంద‌రికీ తెలుసు.. మెహిని చిత్రం త‌న‌కి కమ్ బ్యాక్ గా ఉంటుంది. హారర్ కామెడీ యాక్ష‌న్ చిత్రంగా తెలుగు, త‌మిళ బాష‌ల్లో తెర‌కెక్కింది. ఇప్ప‌టికే విడుదల చేసిన ట్రైల‌ర్ కి మంచి క్రేజ్ రావ‌టంతో ఈ చిత్రంపై అంచ‌నాలు పెరిగాయి. విజువ‌ల్ గ్రాండియ‌ర్ గా హారర్ బ్యూటీతో అంద‌రినీ అల‌రిస్తుంది. మాదేష్ చాలా మంచి కాన్సెప్ట్ తో ఈచిత్రాన్ని తెర‌కెక్కించాడు. క్లీన్ యూ స‌ర్టిఫికెట్ తో జులై 27న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ చిత్రం అంద‌ర్ని ఆక‌ట్టుకుంటుంది. అని పేర్కొన్నారు.

Similar News