రెండ్రోజుల కోసం భారీ మొత్తం అందుకుంటున్నాడు

Update: 2018-04-06 08:23 GMT

ఏదైనా ఒక సినిమాలో గెస్ట్ రోల్ కోసం క్రేజ్ లో ఉన్న నటులను తీసుకుంటే వారికి భారీ మొత్తంలోనే సమర్పించుకోవాల్సి వస్తుంది. అసలు ఒక హీరో కోసం మరో హీరో గెస్ట్ రోల్ చేస్తున్నాడంటేనే ఆ సినిమాపై భారీ హైప్ క్రియేట్ అవుతుంది. అందుకే నిర్మాతలు కూడా ఆయా గెస్ట్ రోల్స్ చేసే వారికీ భారీగానే సమర్పించుకుంటారు. అయితే రెండు మూడు రోజుల షూటింగ్ కోసం అయితే మాత్రం భారీ మొత్తంలో అందుకునే వారు చాలా తక్కువ సంఖ్యలోనే ఉంటారు. ఉదాహరణకి సై రా నరసింహారెడ్డిలో అమితాబ్ బచ్చన్ చిరు కి గురువు గారి పాత్రలో రెండే రెండు రోజుల షూటింగ్ కి డేట్స్ ఇచ్చారు. మరి ఆయన ఈ సినిమాలో గెస్ట్ రోల్ చేసినందుకు గాను భారీ మొత్తంలో అందుకున్నాడనే టాక్ ఉంది.

అయితే మంచు మోహన్ బాబు ఒకప్పుడు హీరోగా, విలన్ గా తన విశ్వరూపం చూపించాడు. కానీ ఇప్పుడు తన వయసుకు తగ్గ పాత్రలను ఎంచుకుంటూ సెలెక్టెడ్ గా సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మహానటి సినిమాలో మోహన్ బాబుని ఎస్వీ రంగారావు పాత్రలో చెయ్యమని నిర్మాత స్వప్న దత్ సంప్రదించగా... మోహన్ బాబు వెంటనే ఒప్పుకుని ఈ సినిమాలో రెండు రోజుల పాటు నటించాడట. అయితే ఎస్వీఆర్ పాత్రకు మోహన్ బాబు తప్ప మరెవరూ న్యాయం చేయలేరనే రేంజ్ లో మోహన్ బాబు మహానటిలో తన నటనతో అదరగొట్టారని... మహానటి చిత్ర బృందం చెబుతున్న మాట.

అయితే కేవలం మహానటి లో రెండు రోజుల పాటు నటించిన మోహన్ బాబుకి మహానటి నిర్మాతలు దాదాపుగా 75 లక్షల రూపాయల పారితోషికం సమర్పించుకున్నారట. మరి ఎస్వీ రంగారావు అంతటి దిగ్గజ నటుడి పాత్రకు న్యాయం చేయగల మోహన్ బాబుకు.. ఆ మొత్తం ఇవ్వడం పెద్ద విషయం కాదని... అంతటి పారితోషకం అందుకోవడానికి మోహన్ బాబు అర్హుడే అని కూడా అంటున్నారు ఫిలిం నగర్ వాసులు.

Similar News