మిస్టర్ మజ్ను డేట్ ఫిక్స్ చేసుకున్నాడు..!

Update: 2018-11-26 06:35 GMT

నిన్నటివరకు అఖిల్ మిస్టర్ మజ్ను విడుదల విషయంలో చాలా కన్ఫ్యూజన్ ఏర్పడింది. మాములుగా వెంకీ అట్లూరితో అఖిల్ మిస్టర్ మజ్నుతో సెట్స్ మీదకు వెళ్లినప్పుడు డిసెంబర్ 21 టార్గెట్ తోనే మొదలు పెట్టారు. కానీ అఖిల్ కి, అక్కినేని వారికి డిసెంబర్ నెల కలిసి రావడం లేదంటూ.. సోషల్ మీడియాలో వార్తలు రావడం, డిసెంబర్ 21న బోలెడన్ని సినిమాలు లైన్ లో ఉండడంతో విడుదల విషయంలో సందిగ్దత ఏర్పడింది. జనవరి మొదటి వారంలో విడుదల చేద్దామనుకుంటే.. మళ్ళీ వారానికే బాలయ్య కథానాయకుడు, రామ్ చరణ్ వినయ విధేయ రామతో వచ్చేస్తున్నారు. సరే ఫిబ్రవరిలో విడుదల చేద్దామంటే మరీ లెట్ అవుతుందని నిర్మాత బీవీఎస్సెన్ ప్రసాద్ భావించాడు.

ఎట్టకేలకు డేట్ ఫిక్స్...

అయితే గత నెల రోజులుగా మిస్టర్ మజ్ను విడుదల డేట్ కోసం తర్జనభర్జన పడిన హీరో దర్శకనిర్మాతలు తాజాగా మిస్టర్ మజ్ను విడుదల డేట్ ని ఫిక్స్ చేసేసారు. జనవరి చివరి వారంలో రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 25న అఖిల్ మిస్టర్ మజ్నుతో దిగుతున్నాడు. అయితే జనవరి 24న బాలకృష్ణ మహానాయకుడు, జనవరి 25న కంగనా మణికర్ణికా సినిమాలు ఉన్నప్పటికీ... బాలయ్య మహానాయకుడు సినిమా విడుదలపై నెలకొన్న అనుమానాలతో అఖిల్ మాత్రం తన మిస్టర్ మజ్నుని బరిలో దింపాడు. మహానాయకుడు విడుదలకు కొన్ని అడ్డంకులు వస్తాయనే అనుమానాలు మీడియాలో వినబడుతున్నాయి కాబట్టే అఖిల్ ధైర్యంగా దిగుతున్నాడంటున్నారు. నిధి అగర్వాల్ తో రొమాన్స్ చేస్తున్న అఖిల్ ఈ సినిమా తో హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. తొలిప్రేమ లాంటి సాలిడ్ హిట్ కొట్టిన వెంకీ కూడా ఈ సినిమాతోనూ హిట్ కొట్టెయ్యాలనే కసితో పనిచేస్తున్నాడు. ప్రస్తుతానికి షూటింగ్ ఒక కొలిక్కి వచ్చేసిందని, పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలైనట్టుగా తెలుస్తుంది.

Similar News