గొంతు సవరిస్తున్న బబ్లీ గర్ల్..!

Update: 2018-09-04 09:03 GMT

టాలీవుడ్ లో ఇటీవలికాలంలో ఎక్కువ శాతం హీరోయిన్స్ తమ సినిమాలకి ఓన్ డబ్బింగ్ చెప్పుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ ‘అజ్ఞాతవాసి’లో కీర్తీ సురేష్, అనూ ఇమ్మాన్యుయేల్ ఓన్ డబ్బింగ్ చెప్పుకున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా ఈ ఏడాది రిలీజ్ అయినా 'మహానటి' సినిమాలోనూ కీర్తి సురేష్ తో పాటు సమంత తమ సొంత గొంతులు వినిపించారు. అలానే ఎన్టీఆర్ ‘అరవింద సమేత వీర రాఘవ’తో పూజా హెగ్డే కూడా సొంత గొంతు వినిపించబోతోంది.

లిస్ట్ లో చేరనున్న మెహరీన్..

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ లిస్ట్ లోకి మరో హీరోయిన్ చేరబోతోంది. బబ్లీ గర్ల్ మెహరీన్ కౌర్ ఓన్ డబ్బింగ్ చెప్పుకోడానికి రెడీ అయిందంట. నాని ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’తో తెలుగు తెరకు పరిచయమైన ఈ పంజాబీ ముద్దుగుమ్మ ఇప్పటివరకు ఆరు సినిమాలపైనే చేసింది. కానీ ఏ సినిమాకి డబ్బింగ్ మాత్రం చెప్పుకోలేదు. ప్రస్తుతం ఆమె అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటిస్తున్న ‘ఎఫ్2’లో వరుణ్ తేజ్‌కి జోడీగా నటిస్తుంది.

పాత్రకు న్యాయం చేయడానికే...

ఈ సినిమాలో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకోవాలని ఆశపడుతుందంట. మరి దీనికి మేకర్స్ ఒప్పుకుంటారో? లేదో? చూడాలి. ఇందులో ఆమెది ఎంట‌ర్‌టైనింగ్ క్యారెక్ట‌ర్ అట‌. దీంతో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుంటే ఆ పాత్రకు న్యాయం చేయొచ్చని భావిస్తోందట. గతంలో ఈమె చేసిన సినిమాల్లో డైలాగులకు లిప్ సింక్ సరిగా అవ్వదనే విమర్శ ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే తన పాత్రకు డబ్బింగ్ చెప్పుకోవాలని అనుకుంటుందట మెహరీన్.

Similar News