మెగా ఈవెంట్ కి అంతా సిద్ధం

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితగాధ ఆధారంగా రూపొందిన చిత్రం సైరా అక్టోబర్ 2 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతుంది. [more]

Update: 2019-09-13 06:36 GMT

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితగాధ ఆధారంగా రూపొందిన చిత్రం సైరా అక్టోబర్ 2 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతుంది. తెలుగు తో పాటు హిందీ, మలయాళం, తమిళంలో రిలీజ్ అవుతున్న ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. రీసెంట్ గా రిలీజ్ టీజర్ కి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాకు మరింత హైప్ పెరిగింది. దీంతో ప్రమోషన్స్ స్టార్ట్ అయ్యాయి. ఇక ఈ నెల 18 న ఈమూవీ యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని ఎల్‌బీ స్టేడియంలో భారీ సెట్‌ వేసి అక్కడ ఈవెంట్ ని జరుపనున్నారు చిత్ర యూనిట్.

ప్రీ రిలీజ్ కు మహామహులు….

ఈ మెగా ఈవెంట్ కి చిరంజీవితో పాటు పవన్ కళ్యాణ్, దర్శకులు రాజమౌళి, కొరటాల శివ, వి.వి వినాయక్, తెలంగాణ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథులుగా హాజరవుతారని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ ట్విట్టర్ లో తెలిపింది. అయితే మరి ఏమైందో ఏంటో కొద్దిసేపటికే మరో ప్రకటన చేశారు. ఈ ఈవెంట్ కి తెలంగాణ మంత్రి హాజరుకావడం లేదని వెల్లడించారు. ఆయనకు యేవో ప్రభుత్వ అధికార కార్యక్రమాలు ఉండడంతో ఆయన రావడం కష్టం అని తెలిపారు.

రాజమౌళి ఏంచెబుతారో…..?

దాదాపు 250 కోట్లు బడ్జెట్ తో తెరకెక్కిన ఈమూవీ లో అమితాబ్ బచ్చన్, జగపతి బాబు, సుదీప్, విజయ్ సేతుపతి, నయన తార, అనుష్క, తమన్నా, నిహారిక నటించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో బిజీగా ఉంది ఈమూవీ. రాజమౌళి కోసం ఒక షో వేసి ఆయన సూచనల మేరకు సినిమాలో మార్పులు చేయనున్నారు.

 

Tags:    

Similar News