సై రా కు మేలు చేసిన కేసీఆర్!

దసరా సెలవలు మొదలు కాగానే.. అక్టోబర్ 2 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సై రా నరసింహారెడ్డి సినిమా విడుదలైన అప్పుడే 13 రోజులు కావొస్తుంది. రెండు [more]

Update: 2019-10-13 06:42 GMT

దసరా సెలవలు మొదలు కాగానే.. అక్టోబర్ 2 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సై రా నరసింహారెడ్డి సినిమా విడుదలైన అప్పుడే 13 రోజులు కావొస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికి దుమ్మురేపుతున్న సై రా నరసింహారెడ్డి కలెక్షన్స్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మరింతగా పెరగనున్నాయి. రెండు వారాలుగా దసరా సెలవులను క్యాష్ చేసుకుంటున్న సై రా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రలో ఆర్టీసీ చేస్తున్న సమ్మె కారణంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని స్కూల్స్, కాలేజెస్ కి మరో వారం రోజులు సెలవలు పొడిగించారు.

మరి ఏపీ లో ఇప్పటికే తెరుచుకున్న స్కూల్స్ తో సై రా కల్లెక్షన్స్ కాస్త తగ్గినా… ఇప్పుడు తెలంగాణాలో మాత్రం మరో వారం సెలవలు ఉండడంతో.. సై రా థియేటర్స్ పిల్లల్తో మళ్ళీ కళకళలాడే అవకాశం ఉంది. ఆర్టీసీ చేస్తున్న సమ్మె కారణం బస్సులు చాలావరకు రోడ్లెక్కని కారణంగా కేసీఆర్ ఇలా సెలవలని పొడిగించే నిర్ణయం తీసుకున్నారు. ఇక చిరంజీవికి ఆ విధంగా కేసీఆర్ వరం ఇచ్చారన్నమాటే

Tags:    

Similar News