ఇస్మార్ట్ తరువాత పూరి చిరుతోనేనా?

మెగాస్టార్ చిరంజీవి తో పూరి జగన్నాధ్ ఎప్పటినుండో ఒక సినిమా తీయాలనుకుంటున్నాడు. కానీ వర్క్ అవుట్ అవ్వడంలేదు. ఎన్ని సార్లు ట్రై చేసినా సెట్స్ మీదకు మాత్రం [more]

Update: 2019-07-26 06:35 GMT

మెగాస్టార్ చిరంజీవి తో పూరి జగన్నాధ్ ఎప్పటినుండో ఒక సినిమా తీయాలనుకుంటున్నాడు. కానీ వర్క్ అవుట్ అవ్వడంలేదు. ఎన్ని సార్లు ట్రై చేసినా సెట్స్ మీదకు మాత్రం వెళ్లడంలేదు. రెండు సినిమాలు అయితే పూజలు కూడా జరిగి సెట్స్ మీదకు వెళ్ళలేదు. ఆమధ్య పూరి చిరు కి ఆటోజానీ అనే చిత్రం కథ చెప్పాడు. సెకండ్ హాఫ్ చిరు కి నచ్చలేదు. దాంతో మరో కథ కూడా తీసుకుని వెళ్లి పూరి చిరు ని ఒప్పించడానికి ట్రై చేసాడు కానీ వర్క్ అవుట్ కాలేదు.

కానీ చిరు ఓకే అంటే ఐదు రోజుల్లో కథ రాసుకుని వెళ్తా అని పూరి రీసెంట్ గా ఇంటర్వ్యూ లో అన్నారు. ఇస్మార్ట్ శంకర్ తరువాత పూరి చిరు తోనే సినిమా తీయాలనుకుంటున్నాడు. దీనిని మెగా ఫ్యామిలీ పరిగణించినట్టే వున్నారు. రీసెంట్ గా రామ్ చరణ్ ఇస్మార్ట్ శంకర్ చూసి రామ్ ఎనర్జీని, పూరి స్కిల్స్‌ని మెచ్చుకున్నాడు. ఈసినిమాను మిగిలిన టాప్ హీరోస్ ఎవరు చూడలేదు. రామ్ చరణ్ తప్ప.

రామ్ చరణ్ చేసిన ఈ ట్వీట్ తో పూరికి మళ్లీ మెగా కాంపౌండ్‌ గేట్లు తెరుచుకుంటాయా? చరణ్ ఇండైరెక్ట్ గా పూరి ని ఏమన్నా కథ ఉంటే చెప్పు అంటున్నాడా? ఏమో చూడాలి. మెగాస్టార్ నుండి మాస్ సినిమా రావాలంటే మెగా కాంపౌండ్ భావిస్తే పూరి నే కదా బెస్ట్ ఆప్షన్.

Tags:    

Similar News