కొత్త లుక్ కోసం టైం అడిగిన మెగా హీరో..?

Update: 2018-07-26 06:42 GMT

జవాన్, ఇంటలిజెంట్, తేజ్ ఐ లవ్ యూ సినిమాల అట్టర్ ఫ్లాప్స్ తో సాయి ధరమ్ తేజ్ బాగా డౌన్ అయ్యాడు. అలాగే సాయి ధరమ్ తేజ్ బ్యాగ్రౌండ్ అంటే మెగా ఫ్యామిలీ అండదండలు కూడా అతనికి ఎలాంటి హెల్ప్ చేయలేకపోయాయి. ఇక సాయి ధరమ్ మార్కెట్ కూడా బాగా కిందకి పడిపోయింది. ఇక సాయి ధరమ్ తన వరస పరాజయాలకు బాగా లోన్లీగా ఫీల్ అవుతున్నాడనుకుంటా.. అందుకే అస్సలు జిమ్ చెయ్యకుండా బాడీని తెగ పెంచేస్తున్నాడు. బరువు బాగా పెరిగిన సాయి ధరమ్ తేజ్ లుక్స్ తేజ్ ఐ లవ్ యూలో బాగా ఇబ్బంది పెట్టేశాయి.

ఈసారి కొత్త లుక్ తో

అయితే తాజాగా సాయి ధరమ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని త్వరలోనే మొదలు పెట్టబోతున్నాడని న్యూస్ ఫిలిం సర్కిల్స్ లో వినబడుతుంది. కిషోర్ తిరుమల దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ తన నెక్స్ట్ మూవీ చెయ్యబోతున్నాడు. ఇక కథల ఎంపికలో బాగా వీక్ గా వున్న సాయి ధరమ్ ఈసారి పర్ఫెక్ట్ కథను ఎన్నుకుని మరీ సెట్స్ మీదకెళ్లాలని డిసైడ్ అయ్యాడట. అలాగే తన లుక్ పై కూడా ప్రత్యేక శ్రద్ద పెట్టాలని సాయి ధరమ్ భావిస్తున్నాడట. ఈసారి న్యూలుక్ తో మంచి ఫిట్నెస్ తో సాయి ధరమ్ తేజ్ తన కొత్త సినిమాలో కనబడతాడట.

భగవద్గీత సాక్షిగా అంటూ ప్రచారం...

మరి న్యూ లుక్ కోసం కనీసం మూడు నెలల టైం అయినా కావాలని... అందుకే దర్శకనిర్మాతలకు తన నిర్ణయం కూడా చెప్పాడట. మరి హీరోగారి న్యూ లుక్ కోసం సాయి చెప్పిన విషయాన్ని కిషోర్ తిరుమలతో పాటుగా నిర్మాత కూడా ఒప్పేసుకున్నారట. ఇంకా పట్టాలెక్కని కిషోర్ తిరుమల - సాయి ధరమ్ తేజ్ కాంబోలో రాబోతున్న ఈ సినిమా టైటిల్ గా భగవద్గీత సాక్షిగా అంటూ ప్రచారం జోరుగా జరుగుతుంది. మరి మరో మూడు నెలల్లో పాటలెక్కబోయే ఈ సినిమా కోసం సాయి ధరమ్ ఎలాంటి లుక్ లోకి మారబోతున్నాడో అనే క్యూరియాసిటీ అప్పుడే మెగా ఫాన్స్ లో మొదలైపోయింది.

Similar News