మారుతీ నెక్ట్స్ ఎవరితో..?

Update: 2018-07-21 07:31 GMT

యూత్ ని అట్రాక్ట్ చేసి యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్స్ తీయడంలో డైరెక్టర్ మారుతీ సిద్ధహస్తుడు అనే చెప్పాలి. అదేవిధంగా ఫ్యామిలీ ఆడియన్స్ ను థియేటర్స్ కు రప్పించే అంశాలు కూడా తన ప్రతి సినిమాలో ఉంటాయి. అటు ఫ్యామిలీ ఆడియన్స్ ను... ఇటు యూత్ ను టార్గెట్ చేసి సినిమాలు తీసే మారుతీ ప్రస్తుతం 'శైలజా రెడ్డి అల్లుడు' అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

హిట్ ఇచ్చిన బ్యానర్ లో...

నాగ చైతన్య - అను ఇమ్మానుయేల్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా టాకీ పార్ట్ దాదాపు పూర్తయింది. త్వరలోనే దీనికి సంబంధించి ఫస్ట్ లుక్ టీజర్ ను రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఇక ఈ సినిమాలో అత్తగా రమ్యకృష్ణ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత మారుతి తనకు పేరు తెచ్చిపెట్టిన బ్యానర్ లో ఇంకో సినిమా చేయనున్నాడు.

కుదిరితే అన్నతో లేదా తమ్ముడితో...

'భలే భలే మగాడివోయ్' సినిమాతో తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించిన గీతా ఆర్ట్స్ లో ఇంకో సినిమా చేయడానికి రెడీ ఉన్నాడు మారుతి. అల్లు అర్జున్ తనకి మంచి మిత్రుడు కావడంతో అతనితో ఓ సినిమా చేయాలనే ఆలోచనలో మారుతి ఉన్నట్టు సమాచారం. మంచి కథను ఆయన రెడీ చేస్తే అల్లు అర్జున్ కూడా ఓకే చెప్పే అవకాశాలు ఉన్నాయని చెప్పుకుంటున్నారు. విక్రమ్ కుమార్, త్రివిక్రమ్ ల సినిమా తర్వాత అల్లు అర్జున్.. మారుతీ చెప్పిన స్టోరీ నచ్చితే అతనితో చేసే అవకాశముంది. ఒకవేళ అల్లు అర్జున్ తో లేట్ అయ్యే అవకాశం ఉంటే అల్లు శిరీష్ తో చేసే అవకాశం లేకపోలేదనే టాక్ వినిపిస్తోంది.

Similar News