ఈసారి క్రేజీ కాంబినేషన్ తో వస్తున్నాడు..!

Update: 2018-11-28 07:52 GMT

ఒకప్పుడు మణిరత్నం సినిమాలన్నీ కల్ట్ క్లాసిక్సే. ఆయన డైరెక్షన్ లో వచ్చిన 'అంజలి', 'ఘర్షణ', 'దళపతి', 'రోజా', 'బొంబాయి', 'నాయకుడు' లాంటి సినిమాలన్నీ సూపర్ హిట్ అవ్వడమే కాదు ఎపిక్ చిత్రాలుగా మిగిలిపోయాయి. ఆ సినిమాలతో తమిళ ప్రేక్షకులతో పాటు అన్ని బాషల ప్రేక్షకులని తన వైపు తిప్పుకునేలా చేసాడు మణి. కానీ గత కొన్నేళ్లుగా తన మ్యాజిక్ ని రిపీట్ చేయలేకపోతున్నాడు మణి. రీసెంట్ గా 'నవాబ్' చిత్రం తమిళంలో హిట్ అనిపించుకున్నా ఇక్కడ జనాలకి నచ్చలేదు. తెలుగులో ఈ సినిమాకి కలెక్షన్స్ కూడా అంతంత మాత్రానే వచ్చాయి.

క్రేజీ కాంబినేషన్ లో...

అంతకుముందు ఈయన డైరెక్షన్ లో 'ఓకే బంగారం' తప్ప ఆ రేంజ్ సక్సెస్ తెలుగులో వచ్చి చాలాకాలం అయింది. 'నవాబ్' తరువాత మణిరత్నం మరో ప్రోజెక్ట్ కు రెడీ అవుతున్నాడు. ఈసారి కూడా మల్టీ స్టారర్ సబ్జెక్ సెట్ చేసుకున్నట్టు ఇన్ సైడ్ టాక్. విజయ్, విక్రమ్, శింబు కాంబినేషన్ ఈ సినిమాను తెరకెక్కించాలని మణిరత్నం ప్లాన్ అట. ముగ్గురు హీరోలకు ఆల్రెడీ లైన్ కూడా చెప్పితే ముగ్గురు ఓకే చేసారని కోలీవుడ్ సమాచారం. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్తే కోలీవుడ్ లోనే మోస్ట్ క్రేజియెస్ట్ కాంబినేషన్ అవుతుంది. 'నవాబ్' చిత్రంలో శింబు యాక్టింగ్ నచ్చడంతో మరోసారి ఆయనను తీసుకున్నాడు మణిరత్నం. ఈ సినిమా స్టార్ట్ అవ్వడానికి మరో ఆరు నెలలు పెట్టె అవకాశముంది. ఆస్కార్ విన్నర్ రహమాన్ సంగీతం అందించే అవకాశముందని సమాచారం.

Similar News