మణిరత్నం డ్రీం ప్రాజెక్ట్ ఆగిపోయింది..!

ఇండియన్ ప్రైడ్ డైరెక్టర్ మణిరత్నం డ్రీం ప్రాజెక్ట్ అయిన ‘పొన్నియిన్ సెల్వన్’ ఎప్పుడో స్టార్ట్ అవ్వాలి కానీ ఏదో ఒక సమస్య వల్ల ఆగిపోతూ వస్తుంది. చాలా [more]

Update: 2019-05-14 08:01 GMT

ఇండియన్ ప్రైడ్ డైరెక్టర్ మణిరత్నం డ్రీం ప్రాజెక్ట్ అయిన ‘పొన్నియిన్ సెల్వన్’ ఎప్పుడో స్టార్ట్ అవ్వాలి కానీ ఏదో ఒక సమస్య వల్ల ఆగిపోతూ వస్తుంది. చాలా ఏళ్ల‌ క్రితం మహేష్ బాబు విజయ్, ఐశ్వర్య రాయ్ వంటి స్టార్స్ తో ఈ చిత్రాన్ని చేయాలని మణిరత్నం ప్లాన్ చేశాడు. కానీ అది వర్క్ అవుట్ అవ్వలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ని తెరకెక్కించాలని మణిరత్నం డిసైడ్ అయ్యాడట. రీసెంట్ గా నవాబ్ చిత్రంతో సక్సెస్ అందుకున్న మణి లైకా ప్రొడక్షన్స్ వారిని రంగంలోకి దించి భారీ బడ్జెట్ తో ‘పొన్నియిన్ సెల్వన్స‌ చిత్రాన్ని చేసేందుకు సిద్దం అయ్యాడు. కాస్టింగ్ కూడా ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయింది.

బ‌డ్జెట్ ఎక్కువ కావ‌డంతో

ఇందులో జయం రవి, కార్తి, అమితాబ్ బచ్చన్, ఐశ్వర్య రాయ్, కీర్తి సురేష్, అనుష్క వంటి స్టార్స్ ను ఎంపిక చేయడం, వారితో చర్చలు కూడా జరపడం జరిగింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్న ఈ ప్రాజెక్ట్ మరోసారి ఆగిపోయినట్టు తెలుస్తుంది. బడ్జెట్ ఎక్కువ అవ్వడంతో లైకా వారు మణిరత్నానికి హ్యాండ్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. శంకర్ – రజనీ కాంబినేషన్ లో తెరకెక్కిన 2.ఓ చిత్రంతో లైకా వారు చాలా లాస్ అయ్యారట. దాంతో ఈ సినిమాను తెరకెక్కించలేం అని చెప్పేశారట. అందుకే మణి ఇప్పుడు మరో ప్రొడ్యూసర్ ని చూసుకునే ప్రయత్నం చేస్తున్నాడు అని తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. శంకర్ ‘ఇండియన్ 2’ చిత్రానికి కూడా ఇదే సమస్య ఎదురైందనే వార్తలు వస్తున్నాయి.

Tags:    

Similar News