క్వీన్ రేంజ్ అది..!

తెలుగులో తెరకెక్కిన ఎన్టీఆర్ బయోపిక్ ఘోరంగా ఫ్లాప్ అయ్యింది. కథానాయకుడు, మహానాయకుడు అంటూ హడావిడి చేసిన క్రిష్, బాలయ్య ప్రస్తుతం మీడియాకి కనబడడం లేదు. ఇక తమిళనాట [more]

Update: 2019-03-25 06:14 GMT

తెలుగులో తెరకెక్కిన ఎన్టీఆర్ బయోపిక్ ఘోరంగా ఫ్లాప్ అయ్యింది. కథానాయకుడు, మహానాయకుడు అంటూ హడావిడి చేసిన క్రిష్, బాలయ్య ప్రస్తుతం మీడియాకి కనబడడం లేదు. ఇక తమిళనాట మాజీ హీరోయిన్, తమిళ రాజకీయాల్లో చక్రం తిప్పి సీఎంగా పనిచేసిన జయలలిత అనారోగ్యంతో కన్నుమూశారు. అయితే ఆమె మరణానంతరం చాలామంది అమ్మ బయోపిక్ ని తెరకెక్కిస్తామంటూ బయలుదేరారు. అయితే అమ్మ మీద ఎవరి వెర్షన్ బయోపిక్స్ వారు ట్రై చేస్తున్నారు. తాజాగా జయలలిత బయోపిక్ విష్ణు ఇందూరి తెరకెక్కించబోతున్నాడు. ఎప్పుడో ప్లాన్ చేసినా ఇప్పటికి అమ్మ బయోపిక్ పట్టాలెక్కబోతుంది.

నిజాలు చూపిస్తారా… దాచేస్తారా..?

తమిళ, హిందీ భాషల్లో విష్ణు ఇందూరి, కె.ఎల్.విజయ్ దర్శకత్వంలో ఈ సినిమాని నిర్మించబోతున్నాడు. అమ్మ బయోపిక్ కి తలైవి అనే టైటిల్ ని ఖరారు చేశారు. ఇక ఈ తలైవిలో జయలలితగా బాలీవుడ్ మానికర్ణిక కంగనా రనౌత్ నటిస్తుందట. అమ్మగా కంగనా దాదాపు ఫైనల్ అయినట్లే. ఇందుకు ఆమె తీసుకునే పారితోషకం ఇప్పుడు తెగ హైలెట్ అవుతుంది. క్వీన్ గా బాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుని మణికర్ణిక సినిమాతో డైరెక్టర్ గా అవతారమెత్తిన కంగనా తలైవి కోసం ఏకంగా 24 కోట్ల పారితోషకాన్ని విష్ణు ఇందురిని డిమాండ్ చేసిందట. ఇక జయలలిత జీవితం మీద చాలామందికి చాలా ఆసక్తి ఉంది. జయలలిత ప్రేమ, పెళ్లి, బిడ్డ, ఎంజీఆర్ తో సంబంధం, శశికళతో స్నేహం వంటివన్నీ ఆమె బయోపిక్ లో చూపిస్తారో లేదంటే ఎన్టీఆర్ బయోపిక్ లా ఒక వెర్షన్ చూపిస్తారో అనేది తెలియాల్సింది. ఇక ఏప్రిల్ నుండి ఈ సినిమా పట్టాలెక్కే ఛాన్స్ ఉన్నట్లుగా సమాచారం.

Tags:    

Similar News