వాళ్లే మణికర్ణికను నాశనం చేస్తున్నారు..!

మణికర్ణిక వివాదం ఇప్పట్లో ముగిసేలా కనబడడం లేదు. దర్శకుడు క్రిష్, హీరోయిన్ కంగనాల మధ్య ఈ వివాదం ముదిరి పాకాన పడేలా కనబడుతుంది. మణికర్ణిక దర్శకత్వం విషయంలో [more]

Update: 2019-02-05 08:40 GMT

మణికర్ణిక వివాదం ఇప్పట్లో ముగిసేలా కనబడడం లేదు. దర్శకుడు క్రిష్, హీరోయిన్ కంగనాల మధ్య ఈ వివాదం ముదిరి పాకాన పడేలా కనబడుతుంది. మణికర్ణిక దర్శకత్వం విషయంలో తలెత్తిన విభేదాలు ఇప్పుడు వారి మధ్యన తారస్థాయికి చేరుకున్నాయి. ఎదురెదురు పడకుండా ఇద్దరూ మీడియా ఎదుట బాహాబాహీకి దిగుతున్నారు. నేను డైరెక్ట్ చేసాను అంటే నేను డైరెక్ట్ చేశానంటున్నారు. 70 శాతం నేను డైరెక్ట్ చేసానని క్రిష్ చెబుతుంటే… క్రిష్ కి మాణికర్ణికతో సంబంధమే లేదు.. అంతా నాదే అన్నట్టుగా కంగనా వ్యవహార శైలి ఉంది. ఇక మణికర్ణిక సినిమాకి హిట్ టాక్ రాకపోయినా.. కంగనా రనౌత్ నటనకు మంచి మార్కులే పడుతున్నాయి. అలాగే బాలీవుడ్ లో మాణికర్ణికతో పాటు మరో భారీ సినిమా లేకపోవడం కూడా మణికర్ణిక కలెక్షన్స్ బాగా పెరిగాయి. ఇక క్రిష్ మీద డైరెక్ట్ ఎటాక్ చేస్తున్న కంగనా తాజాగా ఒక జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో క్రిష్, సోనూసూద్ లపై మరోసారి విరుచుకుపడింది.

వాళ్లకు మాట్లాడే హక్కు లేదు

‘‘మణికర్ణిక సినిమా దర్శకత్వ బాధ్యతల నుండి క్రిష్ తప్పుకున్నాక.. అసలు మణికర్ణిక మీద క్రిష్ నమ్మకాన్ని కోల్పోయాడు. సినిమా పూర్తి చేసి విడుదలకు ముందు డిసెంబర్ లోనే సినిమాని క్రిష్ కి చూపిద్దామనుకున్నాము. కానీ క్రిష్ మేము మణికర్ణిక సినిమాని చెడగొట్టోమనే భావనలో ఉన్నాడు. అసలు ఆయనకు సినిమా మీద ఎలాంటి నమ్మకం లేకపోవడంతో.. మా పని మేము చేసుకుని సినిమాని విడుదల చేశాము’’ అని కంగనా చెబుతోంది. ‘‘విడుదలకు ముందు అందుకే కామ్ అయిన క్రిష్.. సినిమా విడుదలై మంచి టాక్ వచ్చాక తాను 70 శాతం సినిమాని డైరెక్ట్ చేశానని మీడియా ముందుకు రావడం అర్ధం కాలేదని.. అదేదో నాతొ డైరెక్ట్ మాట్లాడి ఉండాల్సింది. ఇప్పుడు మణికర్ణిక గురించి క్రిష్ కి గానీ, సోను సూద్ కు గానీ మాట్లాడే హక్కు లేదు. వాళ్ల వల్లనే మణికర్ణిక నాశనం అయ్యింది’’ అని కంగనా ఆరోపణలు చేస్తోంది. మరి కంగనా ఆరోపణలకి క్రిష్ ఎలాంటి కౌంటర్ వేస్తాడో చూడాలి.

Tags:    

Similar News