ద‌ర్బార్ లో విల‌న్ గా మ‌ల‌యాళ న‌టుడు

సూపర్ స్టార్ రజినీకాంత్ తన 167వ సినిమా మురుగదాస్ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి ‘దర్బార్’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసారు. ఇక ఇందులో [more]

Update: 2019-05-09 07:58 GMT

సూపర్ స్టార్ రజినీకాంత్ తన 167వ సినిమా మురుగదాస్ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి ‘దర్బార్’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసారు. ఇక ఇందులో రజినీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించబోతున్నాడని కోలీవుడ్ సమాచారం. రజినీ సరసన నయనతార, రజినీ కూతురు పాత్రలో నివేద థామస్ నటిస్తున్నారు. ఇందులో విలన్ పాత్ర కోసం ఆల్రెడీ ప్రతీక్ బబ్బర్ ను తీసుకున్నారు. అయితే కథ ప్రకారం ఇందులో మరో విలన్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అందుకే మలయాళ నటుడు ‘చెంబన్’ వినోద్ జోస్ అయితే సరిగ్గా సరిపోతాడని భావించి.. మురుగదాస్ అండ్ టీం అతన్ని ఫైనల్ చేసినట్టు సమాచారం.

పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ గా…

వినోద్ జోస్ గతంలో తమిళంలో ‘గోలీసోడా 2’ సినిమాతో తమిళ ప్రేక్షకులకు చేరువయ్యారు. ఇప్పుడు ఇతనికి ఇది రెండో సినిమా. డైరెక్టర్ మురుగదాస్ ఈ పాత్రని ఎంతో వైవిధ్యభరితంగా మలిచాడట. ఇక రజినీ పాత్ర అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని.. ఫ్యాన్స్ రజినీ మేక్ ఓవర్ చూసి రెచ్చిపోతారని ఇన్సైడ్ టాక్. పొలిటికల్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది స్టార్టింగ్ సంక్రాంతి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

Tags:    

Similar News