సుక్కుకే షాకిచ్చాడు… ఈయనో లెక్కా?

రంగస్థలం లాంటి బెంచ్ మార్క్ మూవీ తీసిన సుకుమార్ నే మహేష్ బాబు నిర్మొహమాటంగా రిజెక్ట్ చేసాడు. రంగస్థలం తర్వాత మహేష్ బాబు తో సుకుమర్ సినిమా [more]

Update: 2020-02-24 10:38 GMT

రంగస్థలం లాంటి బెంచ్ మార్క్ మూవీ తీసిన సుకుమార్ నే మహేష్ బాబు నిర్మొహమాటంగా రిజెక్ట్ చేసాడు. రంగస్థలం తర్వాత మహేష్ బాబు తో సుకుమర్ సినిమా కోసం కమిట్మెంట్ తీసుకుని స్టోరీ లైన్ వినిపించగా.. మహేష్ సుక్కు సినిమాకి కమిట్ అయ్యాడు. అయితే స్టోరీ లైన్ కథగా డెవెలెప్ అయ్యేసరికి మహేష్ కి సుక్కు చెప్పిన పూర్తి స్క్రిప్ట్ నచ్చలేదు. దానితో మహేష్ బాబే స్వయంగా ట్విట్టర్ లో సుక్కు తో సినిమా ఆపేసినట్లుగా ట్వీట్ చెయ్యడం.. అప్పట్లో సంచలనం అయ్యింది. కామ్ గా సుక్కు సినిమాని ఆపేసినా సుక్కు అభిమానులు హార్ట్ అయ్యేవారు కాదు… కానీ మహేష్ స్వయంగా చెప్పేసరికి కాస్త ఫీల్ అయ్యారు. అదే కథతో సుక్కు – అల్లు అర్జున్ కాంబో సెట్ అవడం పట్టాలెక్కడం జరిగిది.

తాజాగా మహేష్ మరో సంచలన నిర్ణయం మీడియా సర్కిల్స్ లోను ఇండస్ట్రీలోని హాట్ టాపిక్ అయ్యింది. మహర్షితో హిట్ ఇచ్చిన వంశి పైడిపల్లి తో మరో మూవీ ఓకె చేసాడు మహేష్ బాబు. అనిల్ రావిపూడి సరిలేరు నీకెవ్వరూ సినిమా తర్వాత మహేష్ – వంశి పైడిపల్లి మూవీ లైన్లోకొచ్చింది. మహర్షి తర్వాత మల్లి మహేష్ కోసం కథ సిద్ధం చేస్తున్న వంశీ ఎలాగో సినిమాకి కమిట్ చేయించడమే కాకుండా కూడా.. కూడా.. తిరిగాడు వంశి పైడిపల్లి. ఇక మరో రెండు నెలల్లో వంశి – మహేష్ సినిమా పట్టాలెక్కుతోంది అనుకుంటున్న టైం లో మహేష్ – పరశురామ్ తెరమీదకి రావడం అందరికి షాకింగ్ న్యూస్ అయ్యింది. వంశి చెప్పిన లైన్ నచ్చిన…. అది కథగా మారేసరికి మహేష్ కి నచ్చకపోవడంతో… వంశి పైడిపల్లి మూవీని హోల్డ్ లో పెట్టి.. పరశురామ్ తో సినిమా సెట్ చేసుకున్నాడనే టాక్ హాట్ హాట్ గా చక్కర్లు కొడుతోంది.

Tags:    

Similar News