మహేష్ - వంశీ సినిమా కొలిక్కి వచ్చేనా?

Update: 2018-05-26 08:36 GMT

'భరత్ అనే నేను' సక్సెస్ తర్వాత మహేష్ తన ఫ్యామిలీతో ఫారెన్ టూర్ వెళ్లి ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ టూర్ నుండి తిరిగి రాగానే తన నెక్ట్ మూవీ కోసం తన బాడీపై శ్రద్ద పెట్టనున్నాడు మహేష్. జూన్ నుండి వంశీ పైడిపల్లి సినిమా షూటింగ్ లో పాల్గొననున్నాడు. వంశీ రెండేళ్ల కిందటే మహేష్ కు ఈ స్టోరీ చెప్పాడంట. కానీ అంతకుముందే కొరటాలతో 'భరత్ అనే నేను' ఒప్పుకోవడంతో ఆ సినిమా చేయాల్సి వచ్చింది.

సినిమా ఆపాలన్న కోర్టు..

వంశీ గత చిత్రం 'ఊపిరి' పీవీపీ బ్యానర్ లో చేశాడు. ఈ సినిమా టైంలోనే పీవీపీ యాజమాన్యం వంశీకి అడ్వాన్స్ ఇచ్చి మరో సినిమాను కూడా వాళ్ల బ్యానర్ లోనే తీయడానికి ఒప్పందం చేసుకున్నారు. వంశీ - మహేష్ కాంబినేషన్ లో తెరకెక్కే మూవీ తమ బ్యానర్ లోనే తీయాలంటూ.. తమతోనే వంశీ ఒప్పందం చేసుకున్నాడని పీవీపీ బ్యానర్ కోర్టుకెక్కింది. లేటెస్ట్ గా కోర్ట్ ఈ వివాదం తేలేవరకు మహేష్ - వంశీ సినిమా ఆపాలని నోటీసులు ఇచ్చింది.

మొదలైన చర్చలు...

అయితే ప్రస్తుతం ఈ సినిమాకు నిర్మాతలుగా ఉన్న దిల్ రాజు, అశ్వినీదత్ లు రంగంలోకి దిగి పీవీపీతో చర్చలు జరుపుతున్నారట. తమతో పాటు పీవీపీ కి కూడా మహేష్ సినిమాకు నిర్మాతలుగా చేర్చుకునే ప్రయత్నాలు కొనసాగుతున్నాయట. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావలసి ఉంది.

Similar News