మహేష్ ఆ దర్శకుడితో మళ్ళీనా?

త్రివిక్రమ్ అల్లు అర్జున్ తో మూడోసారి అలా వైకుంఠపురములో సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొట్టారు. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు హిట్ అలా వైకుంఠపురములో బ్లాక్ బస్టర్ [more]

Update: 2020-04-07 08:32 GMT

త్రివిక్రమ్ అల్లు అర్జున్ తో మూడోసారి అలా వైకుంఠపురములో సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొట్టారు. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు హిట్ అలా వైకుంఠపురములో బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో…. త్రివిక్రమ్ డిమాండ్ పెరిగింది. ఇక ఎన్టీఆర్ త్రివిక్రమ్ ని ముందు జాగ్రత్తగా లాక్ చేసేసుకున్నాడు. అయితే తాజాగా హీరో మహేష్ త్రివిక్రమ్ కి వల వేస్తున్నాడట, వంశి పైడిపల్లి మూవీ ఆగిపోయాక పరశురామ్ మూవీ అన్నారు కానీ స్పష్టత లేదు. దానితో.. ఇప్పుడు త్రివిక్రమ్ – మహేష్ కాంబో తెర మీదకొచ్చింది.

 

ఇప్పటికే త్రివిక్రంతో అతడు, ఖలేజా సినిమాలు చేసిన మహేష్ మరోమారు త్రివిక్రమ్ తో చేసి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నాడట. మహేష్ – త్రివిక్రమ్ కాంబో పై మహేష్ అభిమానులు చాలా ఆసక్తితో ఉన్నారు. ఎప్పటినుండో వీరి కాంబో రావాలని చూస్తున్నారు. అయితే తాజాగా వంశి సినిమా ఆగిపోయాక పరశురామ్ స్టోరీని హోల్డ్ లో పెట్టిన మహేష్ మల్లి త్రివిక్రమ్ వెంట పడుతున్నాడని, RRR సినిమాతో ఎన్టీఆర్ బిజీ కాబట్టి ఈలోపుగా మనమో సినిమా చేద్దామని మహేష్ త్రివిక్రమ్ ని టెంప్ట్ చేస్తున్నట్లుగా వార్తలొస్తున్నాయి. మరి త్రివిక్రమ్ మహేష్ కి టెంప్ట్ అయితే ఓకె.. లేదంటే మాత్రం మహేష్ కి పరశురామ్ దిక్కవుతాడు.

 

Tags:    

Similar News