మహేష్ ఎంతకి పాడతాడో?

మహేష్ బాబు అనుకున్న మూడు నెలల సమయంతో పాటుగా మరో నెల కూడా పూర్తయ్యింది. సరిలేరు నీకెవ్వరూ సినిమా తర్వాత మహేష్ మూడు నెలల గ్యాప్ తో [more]

Update: 2020-05-28 09:13 GMT

మహేష్ బాబు అనుకున్న మూడు నెలల సమయంతో పాటుగా మరో నెల కూడా పూర్తయ్యింది. సరిలేరు నీకెవ్వరూ సినిమా తర్వాత మహేష్ మూడు నెలల గ్యాప్ తో తన తదుపరి చిత్రాన్ని మొదలెడతానని చెప్పాడు. వంశి పైడిపల్లి మూవీని పక్కన పడేసిన మహేష్ బాబు గీత గోవిందం పరశురామ్ కి కమిట్ అయ్యాడని రేపు 31 న సినిమా ఓపెనింగ్ కార్యక్రమాలు నిరాడంబరంగా జరగనున్నాయనే టాక్ తప్ప ఆఫీసియల్ అనౌన్సమెంట్ లేదు. అయితే కృష్ణగారి పుట్టిన రోజుకి హడావిడి చేసి ప్రకటిద్దామనుకుంటే.. కృష్ణ గారు పుట్టిన రోజు వేడుకలు రద్దు కావడంతో మహేష్ – పరశురామ్ మూవీ కూడా జస్ట్ మహేష్ లేకుండానే పూజ కార్యక్రమాలతో సినిమా మొదలు కాబోతుందట.

పరశురామ్ మహేష్ కోసం పూర్తి కథని రెడీ చేసి ఫుల్ స్క్రిప్టుతోనే సెట్స్ మీదకెళ్ళబోతున్నాడని అంటున్నారు. ఇక సినిమా మొదలెట్టే సమయానికే మహేష్ – పరశురామ్ మూవీ టైటిల్ కూడా బయటికి రాబోతుందట. ఇప్పటికే టైటిల్ సెట్ చేసుకుని హీరోయిన్ వేటలో పరశురామ్ బృందం ఉందట. అయితే పరశురామ్ – మహేష్ మూవీ కి కొత్తగా సరికొత్తగా సర్కారీ వారి పాట అనే కొత్తరకం టైటిల్ పెట్టబోతున్నారట. మరి మహేష్ ఎంతకి పాడతాడో ఈ వేలం పాట అంటూ అప్పుడే మహేష్ అభిమానులు హాట్ హాట్ చర్చలకు దిగారు. మరి ఈ క్రేజీ టైటిల్ లో మహెష్ కి పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది.. ఈ సినిమా సూపర్ హిట్ అంటున్నారు అభిమానులు.

Tags:    

Similar News