సందీప్ కి నో చెప్పిన మహేష్..!

అర్జున్ రెడ్డితో అందరి దృష్టిని ఆకట్టుకున్న డైరెక్టర్ సందీప్ వంగా తన మొదటి సినిమా తరువాత వెంటనే బాలీవుడ్ స్టార్ హీరోని డైరెక్ట్ చేస్తున్నాడు. తెలుగులో అర్జున్ [more]

Update: 2019-03-01 07:22 GMT

అర్జున్ రెడ్డితో అందరి దృష్టిని ఆకట్టుకున్న డైరెక్టర్ సందీప్ వంగా తన మొదటి సినిమా తరువాత వెంటనే బాలీవుడ్ స్టార్ హీరోని డైరెక్ట్ చేస్తున్నాడు. తెలుగులో అర్జున్ రెడ్డి సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించడంతో బాలీవుడ్ లో ఈ సినిమాను రీమేక్ చేసే ఛాన్స్ వచ్చింది. ‘అర్జున్ రెడ్డి’ సినిమాను హిందీలో ‘కబీర్ సింగ్’ టైటిల్ తో రీమేక్ చేస్తున్నాడు. హిందీలో షాహిద్ కపూర్ హీరోగా, కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నఈ సినిమా తరువాత సందీప్.. మహేష్ బాబు ని డైరెక్ట్ చేయనున్నాడు అని ఆ మధ్య వార్తలు వచ్చాయి.

పాత్ర సూట్ అవ్వదని…

సందీప్ చెప్పిన కథ మహేష్ కి నచ్చడంతో వెంటనే ఓకే చేసాడని టాక్. అయితే తాజా సమాచారం ప్రకారం మహేష్ ఈ ప్రాజెక్ట్ ని పక్కన పెట్టాడని తెలుస్తుంది. మహేష్ కు ఈ కథ నచ్చినప్పటికీ హీరో క్యారెక్టరైజేషన్ తనకు సూట్ కాదేమోననే అనుమానాలు ఉన్నాయట. తన ఇమేజ్ కి సూట్ కానీ పాత్రలో నటించడం రిస్క్ అని భావించి సందీప్ కి నో చెప్పాడంట. అయితే ఫ్యూచర్ లో మాత్రం కలిసి సినిమా చేద్దాం అని ప్రామిస్ చేశాడట. మరి ఈ వార్తల్లో ఎంతరవరకు నిజం ఉందో తెలియాలంటే కొన్ని రోజులు వరకు ఆగాల్సిందే.

Tags:    

Similar News